Chhattisgarh Election 2023: ఛత్తీస్గఢ్ను దోచుకుని ఖజానా నింపుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh Election 2023: నవంబర్ 17న చత్తీస్గఢ్లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు బీజేపీ సీనియర్ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు(సోమవారం) విజయ్ సంకల్ప్ మహార్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రధాని మోడీ ఛత్తీస్గఢ్లోని మహాసముంద్కు చేరుకున్నారు. భూపేష్ బఘేల్ ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేశారు. నవంబర్ 7న జరిగిన తొలి దశలో జరిగిన ఓటింగ్లో కాంగ్రెస్ అబద్ధాల బెలూన్ పగిలిపోయిందని, ఈరోజు ఛత్తీస్గఢ్ మొత్తం ఒక్క స్వరంతో-బీజేపీ ఈజ్ బ్యాక్ అని చెబుతోందని ప్రధాని మోడీ అన్నారు. ఛత్తీస్గఢ్ను బీజేపీ సృష్టించిందని, ఈ రాష్ట్రాన్ని బీజేపీ మాత్రమే మెరుగుపరుస్తుందని, ఇది కేవలం నినాదం కాదని.. ఇది మా విధేయత, మీతో మాకు ఉన్న పవిత్ర బంధమని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Also Read: West Bengal: టీఎంసీ నాయకుడు దారుణ హత్య.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత
Also Read
- Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
- Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
భూపేష్ బఘేల్పై విరుచుకుపడిన ప్రధాని మోదీ.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పని చేసిందన్న ప్రధాని.. ప్రజల సంక్షేమం నిలిచిపోయిందన్నారు. ఛత్తీస్గఢ్ను దోచుకుని ఖజానా నింపుకోవడమే కాంగ్రెస్కు ఒకే ఒక లక్ష్యం అని, ఛత్తీస్గఢ్ను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఓడిపోతుందో, ఛత్తీస్గఢ్ను అభివృద్ధి చేసే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ రాష్ట్రానికి అందాల్సిన ఎత్తులను చేరుకుంటామన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి మిమ్మల్ని ఆహ్వానించేందుకు వచ్చానని ప్రధాని మోడీ అన్నారు. ఓట్ల లెక్కింపు తేదీని గుర్తు చేస్తూ.. ‘డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని మీ అందరినీ ఆహ్వానించేందుకు వచ్చాను.. ప్రమాణ స్వీకారోత్సవానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.” అని ప్రధాని మోడీ తెలిపారు.
Also Read: Ashok Gehlot: రాజస్థాన్ ఎన్నికల్లో చర్చనీయాంశంగా కన్హయ్య లాల్ హత్య.. ఎదురుదాడికి దిగన గెహ్లాట్
మహాదేవ్ యాప్ బెట్టింగ్ వ్యవహారంపై ప్రధాని మోడీ బఘెల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మహాదేవ్ యాప్ బెట్టింగ్ సమస్యపై బఘేల్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రధాని మోదీ.. “ఈరోజు మీరు ఫోన్లో 508 అని టైప్ చేసిన వెంటనే మీ మొబైల్ మాట్లాడుతుంది. ఈ 508 సమస్య గురించి ప్రపంచం మొత్తం తెలుసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఛత్తీస్గఢ్ మహతారీ గౌరవాన్ని మసకబారించే ధైర్యం కాంగ్రెస్కు ఉంది. కావున, నవంబర్ 17న వీలైనంత ఎక్కువగా ఓటు వేసి, కమలం బటన్ను నొక్కి కాంగ్రెస్ను కడిగిపారేయాల్సిన బాధ్యత ప్రతి ఛత్తీస్గఢ్ వాసులపై ఉంది.” అని ప్రధాని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
-
Peddi : ‘పెద్ది’తో రామ్చరణ్ పాన్ ఇండియా కొట్టాల్సిందే.. లేదంటే అంతే
-
Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
-
Hypersonic Missiles: హైపర్సోనిక్ క్షిపణి టెక్నాలజీలో భారత్ కీలక విజయం.. DRDO స్క్రామ్జెట్ ఇంజిన్ టెస్ట్ సక్సెస్
-
HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!