CM Pinarayi Vijayan: భారత్, ఇజ్రాయిల్తో సైనిక, రక్షణ ఒప్పందాలను తెంచుకోవాలి.. సీఎం సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Pinarayi Vijayan: కేరళలో పాలక సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా సంఘీభావం ర్యాలీలను చేపడుతున్నాయి. శనివారం కోజికోడ్ వేదికగా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో మాట్లాడిన విజయన్.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ఇజ్రాయిల్కి మద్దతు ఇచ్చే విధానాన్ని అవలంభిస్తోందని, బీజేపీ విధానాన్ని ఇండియా స్టాండ్గా పరిగణించొద్దని అన్నారు. మా సంఘీభావం పాలస్తీనా అనుకూలంగానే ఉంటుందని అన్నారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మధ్య భారతదేశం పాలస్తీనాకు సంఘీభావంగా నిలిచిందని, ఇజ్రాయిల్కి మద్దతు ఇవ్వడం పాలక బీజేపీ విధానంలో భాగమని కేరళ సీఎం పేర్కొన్నారు.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ భారత్ ను ఆయుధంగా వాడుకుంటోందని, ఇజ్రాయిల్తో సైనిక, రక్షణ ఒప్పందాలను భారత్ నిలిపేయాలని సీఎం విజయన్ డిమాండ్ చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తరువాత కాలంలో భారత్ పాలస్తీనాకు మద్దతు ఇచ్చిందని, పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో ఇజ్రాయిల్ని మనం గుర్తించడం ప్రారంభించామని, అమెరికాతో ఉన్న స్నేహం ప్రభావం చూపిందని వివరించారు. నెహ్రూ కూడా పాలస్తీనా అనుకూల విధానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు.
Read Also: Kalidas Jayaram: పెళ్లికి సిద్ధమైన విక్రమ్ నటుడు.. సైలెంటుగా షాకిచ్చాడుగా!
కాంగ్రెస్ పేరు చెప్పకుండా.. దేశంలో బలమైన ప్రభావం ఉందని చెప్పుకునే కొన్ని రాజకీయ పార్టీలు పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొనడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మన దేశంలో చాలా చోట్ల పాలస్తీనా అనుకూల ర్యాలీలను చూశామని, ఎక్కువగా వామపక్షాలే వీటిని నిర్వహించాని, అయితే దేశంలో బలమైన ప్రభావం ఉందని చెప్పుకునే పార్టీ ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించారు. కేరళలో మాత్రం వారి వైఖరి వేరేలా ఉంటుందని కాంగ్రెస్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 29న ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపత్యంలో గాజాస్ట్రిప్తో మానవతావాద సంధికి పిలుపునిచ్చే తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఓటింగ్కి భారత్ గైర్హాజరు కావడాన్ని పినరయి విజయన్ తప్పుపట్టారు. ఇజ్రాయిల్ కి మద్దతు ఇవ్వడం అంటే సొంత భూమి కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లకు విధానాన్ని ఉల్లంఘించడమే అని అన్నారు.
తాజావార్తలు
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!