CM Pinarayi Vijayan: భారత్, ఇజ్రాయిల్తో సైనిక, రక్షణ ఒప్పందాలను తెంచుకోవాలి.. సీఎం సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Pinarayi Vijayan: కేరళలో పాలక సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా సంఘీభావం ర్యాలీలను చేపడుతున్నాయి. శనివారం కోజికోడ్ వేదికగా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో మాట్లాడిన విజయన్.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ఇజ్రాయిల్కి మద్దతు ఇచ్చే విధానాన్ని అవలంభిస్తోందని, బీజేపీ విధానాన్ని ఇండియా స్టాండ్గా పరిగణించొద్దని అన్నారు. మా సంఘీభావం పాలస్తీనా అనుకూలంగానే ఉంటుందని అన్నారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మధ్య భారతదేశం పాలస్తీనాకు సంఘీభావంగా నిలిచిందని, ఇజ్రాయిల్కి మద్దతు ఇవ్వడం పాలక బీజేపీ విధానంలో భాగమని కేరళ సీఎం పేర్కొన్నారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ భారత్ ను ఆయుధంగా వాడుకుంటోందని, ఇజ్రాయిల్తో సైనిక, రక్షణ ఒప్పందాలను భారత్ నిలిపేయాలని సీఎం విజయన్ డిమాండ్ చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తరువాత కాలంలో భారత్ పాలస్తీనాకు మద్దతు ఇచ్చిందని, పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో ఇజ్రాయిల్ని మనం గుర్తించడం ప్రారంభించామని, అమెరికాతో ఉన్న స్నేహం ప్రభావం చూపిందని వివరించారు. నెహ్రూ కూడా పాలస్తీనా అనుకూల విధానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు.
Read Also: Kalidas Jayaram: పెళ్లికి సిద్ధమైన విక్రమ్ నటుడు.. సైలెంటుగా షాకిచ్చాడుగా!
కాంగ్రెస్ పేరు చెప్పకుండా.. దేశంలో బలమైన ప్రభావం ఉందని చెప్పుకునే కొన్ని రాజకీయ పార్టీలు పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొనడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మన దేశంలో చాలా చోట్ల పాలస్తీనా అనుకూల ర్యాలీలను చూశామని, ఎక్కువగా వామపక్షాలే వీటిని నిర్వహించాని, అయితే దేశంలో బలమైన ప్రభావం ఉందని చెప్పుకునే పార్టీ ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించారు. కేరళలో మాత్రం వారి వైఖరి వేరేలా ఉంటుందని కాంగ్రెస్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 29న ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపత్యంలో గాజాస్ట్రిప్తో మానవతావాద సంధికి పిలుపునిచ్చే తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఓటింగ్కి భారత్ గైర్హాజరు కావడాన్ని పినరయి విజయన్ తప్పుపట్టారు. ఇజ్రాయిల్ కి మద్దతు ఇవ్వడం అంటే సొంత భూమి కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లకు విధానాన్ని ఉల్లంఘించడమే అని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!