పార్టీ నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో ఏది పడితే అది మాట్లాడొద్దని సూచించారు. కవిత అరెస్ట్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించి కాదు... వ్యక్తిగతమైన ఇష్యూ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కవిత అరెస్ట్ గురించి ప్రెస్ మీట్ లు పెట్టొద్దని ఆదేశించారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్పై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అవినీతికి పాల్పడినందుకు ఆమె జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని... ఈ రోజు సోదరి వెళ్లింది... రేపు సోదరుడు వెళ్ళవచ్చు... ఎల్లుండి తండ్రి కూడా జైలుకు వెళ్లవచ్చునని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులు, అరెస్ట్ పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది.. ఇన్ని రోజులు లేనిది పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ అరెస్టులు ఏంటి అని ఆమె ప్రశ్నించారు. చట్టానికి వ్యతిరేకంగా ఈడీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీహార్లో ముఖ్యమంత్రి నితీష్కుమార్ తన కేబినెట్ను విస్తరించారు. కొత్తగా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ నుంచి 9 మంది, బీజేపీ నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఎలక్టోరల్ బాండ్ల పథకంపై విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం డిమాండ్ చేశారు.
Bandi Sanjay: దయచేసి ఆలోచించాలని, అందరి గురించి మోడీ ఆలోచిస్తున్నారని, మీరు పువ్వు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపిస్తే నేను వెళ్లి మోడీకీ ఓటేస్తా అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
Bengaluru Water crisis: వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు.. కోవిడ్ని గుర్తు చేస్తున్న బెంగళూర్ నీటి సంక్షోభం..బెంగళూర్ వాసులకు నీటి కష్టాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఎండలు పూర్తిగా ముదరకముందే సిలికాన్ వ్యాలీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వ కష్టపడుతోంది. ఇప్పటికే చాలా వరకు అపార్ట్మెంట్లలో నీరు లేదు. దీంతో వారంతా డిస్పోజబుల్ ప్లేట్లను, వెట్ వైప్లను వాడుతున్నారు. మరికొందరు సమీపంలోని మాల్స్లకి కస్టమర్లలా వెళ్లి కాలకృత్యాలను తీర్చుకుంటున్నారు. మరో మూడు నాలుగు…