Ex MLA Aroori Ramesh: ఢిల్లీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్..! అందుకేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex MLA Aroori Ramesh: వరంగల్ లో ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు కలచివేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని వీడే నేతలను బుజ్జగిస్తున్నా రాజకీయాల్లో భాగంగా జంప్ చేస్తున్న జంప్ జిలానీల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు ఆరూరి రమేశ్ కోసం బీఆర్ఎస్, బీజేపీ నేతలు రోడ్డుపై పోరాడిన ఘటనలు మరువకముందే ఆరూరి రమేష్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, బలవంతంగా తీసుకెళ్లలేదని, తానే హైదరాబాద్కు వచ్చానని, కేసీఆర్ వద్దకు స్వయంగా నేనే వచ్చానని ఆరూరి రమేష్ అన్నారు. తాను అమిత్ షాను కూడా కలవలేదని మీడియా ద్వారా వ్యాఖ్యలు చేశారు కూడా.. అయితే.. అమిత్ షాను కలిసేందుకు ఆరూరి రమేష్ వెళ్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇక మరోవైపు నిన్న కేసీఆర్తో జరిగిన సమావేశంలో తుది అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే.. వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య ఎన్నికల బరిలోకి దిగనున్నారు.
Read also: Google + AI : ఆండ్రాయిడ్ వినియోగదారులకు అద్భుతమైన ఏఐ ఫీచర్స్.. అవేంటంటే?
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కె.కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటన చేశారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావడంతో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు బీఆర్ ఎస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించారు. అయితే వరంగల్ లోక్ సభ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈరోజు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ వార్త తాజా పరిణామాలతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. ఈరోజు ఢిల్లీలో వరంగల్ లోక్ సభ నుంచి పోటీ చేసే అవకాశం కోసం ఆరూరి రమేష్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని టాక్. బీజేపీ నేతలతో కలిసి ఆరూరి రమేష్.. బీజేపీలో చేరనున్నారనే ఆసక్తికర చర్చ సాగుతోంది. నిన్నటి రచ్చ తర్వాత ఆయన చేరికపై బీజేపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఏది ఏమైనా వరంగల్ లో ప్రస్తుతం అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రధానంగా కనిపిస్తున్నాయి.
Google + AI : ఆండ్రాయిడ్ వినియోగదారులకు అద్భుతమైన ఏఐ ఫీచర్స్.. అవేంటంటే?
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!