Navneet Kaur Rana: లోక్సభ ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అన్ని పార్టీల కన్నా ముందే తన ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి ఓట్ల షేరింగ్ చర్చలు నడుస్తున్నాయి. దీంతో ముందే అభ్యర్థులను ప్రకటించి ఇండియా కూటమిని డిఫెన్స్లోకి నెట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది. మరోవైపు ఇండియా కూటమిలో పలు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ కుదరడం లేదు.
Kangana ranaut: బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్ మండి ఎంపీ స్థానం నుంచి పోటీలో నిలబడుతున్న కంగనాపై సోషల్ మీడియా వేదికగా శ్రీనతే అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నాడియా జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక తన ఇంట్లోనే అత్యాచారానికి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత కొడుకు ఈ దారుణానికి పాల్పడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, బీజేపీ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఎవరూ ఉండరని, 2032 నాటికి ముస్లింలు కూడా ఆ పార్టీని వదిలి వెళ్తారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం పడిపోతుందని కలలో కూడా ఊహించలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ఎట్లుంటదో జనాలకు అర్థం అయ్యింది.. ఈ ప్రభుత్వంపై గ్రామాల్లో మన్నువోసుడు, దుమ్మువోసుడే కనిపిస్తుంది. అయితే, మల్కాజ్ గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి ఒక్కడే లోకల్.. ఇద్దరు నాన్ లోకలే అని ఆయన చెప్పుకొచ్చారు.
PM Modi: శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, డీఎంకే మంత్రి అనితా రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ)కి బీజేపీ ఫిర్యాదు చేసింది. పీఎంని కించపరిచే విధంగా ఇద్దరు నేతలు వ్యాఖ్యలు చేశారని మంగళవారం ఫిర్యాదు చేశారు. విదర్భ ప్రాంతంలోని బుల్దానాలో జరిగిన ర్యాలీలో సంజయ్ రౌత్ ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీని ఔరంగజేబులో పోల్చారు. తమిళనాడు పశుసంవర్థక శాఖ మంత్రి అని రాధాకృష్ణన్ రాష్ట్రంలో జరిగిన ఓ సభలో ప్రధానిపై అవమానకరమైన…