AAP: ఆప్కి భారీ షాక్.. బీజేపీలో చేరిన ఆ పార్టీ ఏకైక లోక్సభ ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడంతో ఇబ్బందుల్లో పడిండి. లోక్సభ ఎన్నికల ముందు ఆయన అరెస్ట్ కావడంతో ఆప్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే ఆప్కి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ తరుపున లోక్సభలో ఉన్న ఏకైక ఎంపీ తాజాగా బీజేపీలో చేరారు. ఎంపీ సుశీల్ రింకూ ఈ రోజు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాయలంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. రింకూ 2023 జలంధర్ ఎంపీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు. ప్రస్తుతం రాబోతున్న లోక్సభ ఎన్నికల్లో జలంధర్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగుతారని తెలుస్తోంది.
Read Also: Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేపై కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు
Also Read
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
- Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
- West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
543 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్లో రింకూ ఆప్ పార్టీ తరుపున ఉన్న ఒకే ఒక ఎంపీ. పంజాబ్ అభివృద్ధి కోసం, ముఖ్యంగా జలంధర్ కోసం తాను బీజేపీలో చేరానని, అభివృద్ధి కార్యక్రమాలను ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. అంతముందు రోజు మంగళవారం లూథియానా ఎంపీ, కాంగ్రెస్ నేత రవ్నీత్ సింగ్ బిట్టు కూడా బీజేపీలో చేరారు. మిస్టర్ బిట్టు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు. రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా నిలబడిని సిక్కు నేతల్లో బియాంత్ సింగ్ చాలా ప్రముఖుడు. పదవిలో ఉండగా ఉగ్రవాద దాడిలో ఆయన హత్యకు గురయ్యారు. పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు 2024 లోక్సభ ఎన్నికల్లో ఏడవ మరియు చివరి దశ అయిన జూన్ 1న పోలింగ్ జరగనుంది.
MP Sushil Kumar Rinku & Punjab MLA Sheetal Angural join the BJP at party headquarters in Delhi. https://t.co/e8DYOT2WSX
— BJP (@BJP4India) March 27, 2024
తాజావార్తలు
-
Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
-
Tata Sierra EV: జూన్ 30న టాటా సియెర్రా EV లాంచ్.. 500 కి.మీ. రేంజ్తో వస్తున్న SUV
-
Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
-
Maharashtra: ఫుట్బాల్ కోచ్ దారుణం.. మూడేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం..
-
NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య – కొరటాల మూవీ ఓపెనింగ్కు సీఎం చంద్రబాబు, లోకేష్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!