Collector Advaith Kumar : మహబూబాబాద్ కలెక్టర్ బదిలీ.. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్న గిరిజన సంఘాలు.!
- కలెక్టర్ బదిలీపై గిరిజన సంఘాల సంబరాలు
- జిల్లా అభివృద్ధిని విస్మరించారన్న ఆరోపణలు
- ప్రత్యేక నిధుల వినియోగంపై తీవ్ర విమర్శలు
- ప్రజల సమస్యలు పట్టించుకోలేదన్న ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ను ప్రభుత్వం బదిలీ చేయడంతో మానుకోట (మహబూబాబాద్) జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. గత కొంతకాలంగా కలెక్టర్ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గిరిజన ప్రజా సంఘాలు, ఈ బదిలీ వార్త తెలియగానే రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నాయి. బాణసంచా కాల్చి, ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
గత రెండు సంవత్సరాలుగా కలెక్టర్గా పనిచేసిన అద్వైత్ కుమార్, జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని గిరిజన నాయకులు ఆరోపించారు. ఒక గిరిజన జిల్లాగా ఉన్న మహబూబాబాద్ను ఆయన తన నిర్ణయాలతో పదేళ్ల పాటు వెనక్కి నెట్టేశారని వారు విమర్శించారు. రైతుల భూ సమస్యలు, పట్టాదారు పాసుపుస్తకాల జాప్యం వంటి కీలక అంశాలను ఆయన గాలికి వదిలేశారని మండిపడ్డారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
జిల్లా కలెక్టర్కు వచ్చే ప్రత్యేక నిధులను (Special Funds) పేద వర్గాల ప్రజల సంక్షేమం కోసం లేదా అభివృద్ధి పనుల కోసం వినియోగించలేదని బాధితులు పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాల్సిన నిధులను తిరిగి ప్రభుత్వానికి పంపించేశారని, ఇది జిల్లా ప్రజలకు చేసిన ద్రోహమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా , వైద్య రంగాల్లో నెలకొన్న కనీస సమస్యలను కూడా ఆయన పరిష్కరించలేకపోయారని ధ్వజమెత్తారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఇచ్చిన ఆదేశాలను కూడా కలెక్టర్ లెక్కచేయలేదని, దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గిరిజన సంఘాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గిరిజన జిల్లా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా సమస్యలను అర్థం చేసుకునే కొత్త కలెక్టర్ రావాలని వారు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!