జేడీయూ నేత నితీశ్ కుమార్కు బీహార్ మహిళలంతా అండగా నిలుస్తున్నారు. జేడీయూను గెలిపించి ఎలాగైనా నితీశ్ను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోపెట్టేందుకు నడుం బిగించినట్లు కనిపిస్తున్నారు. ఉదయం నుంచీ రసవత్తరంగా సాగుతున్న బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళుతోంది. నితీశ్ కుమార్ విధానాలను బీహార్లోని పురుష ఓటర్లు విభేదిస్తున్నా.. మహిళా ఓటర్లు మాత్రం ఆయనను ఆదరిస్తున్నారు. ఇదే విషయంపైనే ఇప్పుడు స్థానిక గ్రామాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్డీఏ కూటమి భాగస్వాములైన బీజేపీ-జేడీయూల్లో బీజేపీయే ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో…