అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. పేరుకుపోయిన కోవిడ్ టీకాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సమయంలో ఎన్నో భయాలు.. వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో అయిపోతుందనే అనుమానాలు.. ఇక, ఆ తర్వాత క్రమంగా వ్యాక్సిన్వైపు పరుగులు పెట్టారు జనం.. కానీ, అప్పుడు వ్యాక్సిన్లు దొరకని పరిస్థితి.. గంటల తరబడి లైన్లలో వేచిచూడాల్సిన దుస్థితి.. ఆ తర్వాత నో స్టాక్ బోర్డులు పెట్టి.. వ్యాక్సిన్ హాలిడే ప్రకటించిన సందర్భాలు ఎన్నో.. క్రమంగా ఆ పరిస్థితి పోయింది.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యింది.. వ్యాక్సిన్ సెంటర్లలోనే కాదు.. వార్డులు, గ్రామాలు.. అంతెందుకు పంట పొలాల్లో తిరుగుతూ కూడా వ్యాక్సిన్లు వేశారు. అయినా, ఇంకా వ్యాక్సిన్లు వేసుకోనివారి సంఖ్య భారీగానే ఉంది.. మరోవైపు వ్యాక్సిన్ నిల్వలు కూడా పెరిగిపోతున్నాయి.
Read Also: భారత్లో కరోనా థర్డ్వేవ్..! తాజా హెచ్చరికలు
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
దేశవ్యాప్తంగా 23 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని పార్లమెంట్లో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వినియోగించని టీకాలు 11 కోట్ల మేర నిల్వ ఉన్నాయని.. దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 23 కోట్లకు పైగానే అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాజ్యసభకు తెలిపింది. ఇక, ఉత్తరప్రదేశ్లో ఒక్క డోసూ వేయించుకోని వారు 3.50 కోట్ల మంది ఉన్నారని.. బీహార్లో ఆ సంఖ్య 1.89 కోట్ల మంది, మహారాష్ట్రలో 1.71 కోట్ల మంది, తమిళనాడులో 1.24 కోట్ల మంది ఉన్నారని స్పష్టం చేసింది. మరోవైపు.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. ఇక, ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కన్షార్షియం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా 125 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరగా.. 94 దేశాలకు 7.23 కోట్లకు పైగా డోసులను సరఫరా చేసింది భారత్. ఇక 150 దేశాలకు భారత్ నుంచి కోవిడ్ సంబంధింత మందులు, ఇతర సాయాన్ని అందించింది భారత్. ఒమిక్రాన్ వేరియంట్ భారత్లో ప్రవేశంచడం.. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. వ్యాక్సిన్ వేసుకోనివారు ముందు ఆ పని చేయండి అంటూ ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా.. ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ సెంటర్లకు రావడంలేదు. దీంతో.. వారిలో అవగాహన కల్పించడంపై దృష్టిసారించింది సర్కార్.
తాజావార్తలు
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!