అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. పేరుకుపోయిన కోవిడ్ టీకాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సమయంలో ఎన్నో భయాలు.. వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో అయిపోతుందనే అనుమానాలు.. ఇక, ఆ తర్వాత క్రమంగా వ్యాక్సిన్వైపు పరుగులు పెట్టారు జనం.. కానీ, అప్పుడు వ్యాక్సిన్లు దొరకని పరిస్థితి.. గంటల తరబడి లైన్లలో వేచిచూడాల్సిన దుస్థితి.. ఆ తర్వాత నో స్టాక్ బోర్డులు పెట్టి.. వ్యాక్సిన్ హాలిడే ప్రకటించిన సందర్భాలు ఎన్నో.. క్రమంగా ఆ పరిస్థితి పోయింది.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యింది.. వ్యాక్సిన్ సెంటర్లలోనే కాదు.. వార్డులు, గ్రామాలు.. అంతెందుకు పంట పొలాల్లో తిరుగుతూ కూడా వ్యాక్సిన్లు వేశారు. అయినా, ఇంకా వ్యాక్సిన్లు వేసుకోనివారి సంఖ్య భారీగానే ఉంది.. మరోవైపు వ్యాక్సిన్ నిల్వలు కూడా పెరిగిపోతున్నాయి.
Read Also: భారత్లో కరోనా థర్డ్వేవ్..! తాజా హెచ్చరికలు
Also Read
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
దేశవ్యాప్తంగా 23 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని పార్లమెంట్లో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వినియోగించని టీకాలు 11 కోట్ల మేర నిల్వ ఉన్నాయని.. దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 23 కోట్లకు పైగానే అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాజ్యసభకు తెలిపింది. ఇక, ఉత్తరప్రదేశ్లో ఒక్క డోసూ వేయించుకోని వారు 3.50 కోట్ల మంది ఉన్నారని.. బీహార్లో ఆ సంఖ్య 1.89 కోట్ల మంది, మహారాష్ట్రలో 1.71 కోట్ల మంది, తమిళనాడులో 1.24 కోట్ల మంది ఉన్నారని స్పష్టం చేసింది. మరోవైపు.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. ఇక, ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కన్షార్షియం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా 125 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరగా.. 94 దేశాలకు 7.23 కోట్లకు పైగా డోసులను సరఫరా చేసింది భారత్. ఇక 150 దేశాలకు భారత్ నుంచి కోవిడ్ సంబంధింత మందులు, ఇతర సాయాన్ని అందించింది భారత్. ఒమిక్రాన్ వేరియంట్ భారత్లో ప్రవేశంచడం.. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. వ్యాక్సిన్ వేసుకోనివారు ముందు ఆ పని చేయండి అంటూ ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా.. ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ సెంటర్లకు రావడంలేదు. దీంతో.. వారిలో అవగాహన కల్పించడంపై దృష్టిసారించింది సర్కార్.
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!