12 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి.. బతికే ఉన్నాడని అందిన సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ తాజాగా తెలిసింది. అతడు పాకిస్థాన్ జైలులో బందీగా ఉన్నట్లు సమాచారం అందడంతో సదరు వ్యక్తి కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… బీహార్లోని బక్సర్ జిల్లా ఖిలాఫత్పూర్కు చెందిన ఛావీ అనే వ్యక్తి 12 ఏళ్ల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో అతడి వయసు 18 సంవత్సరాలు. అంతేకాదు అతడి మానసిక స్థితి కూడా సరిగా లేదు. అయితే అతడి కోసం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా… ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో చనిపోయాడని భావించి కర్మకాండలు కూడా నిర్వహించారు.
Read Also: వీడెవడండీ బాబూ… మహిళ అండర్వేర్ను మాస్క్గా పెట్టుకున్న వ్యక్తి
Also Read
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
కట్ చేస్తే… తాజాగా ఛావీ బతికే ఉన్నాడని కుటుంబసభ్యులకు స్పెషల్ బ్రాంచీ పోలీసుల నుంచి ఓ లేఖ అందింది. అతడు పాకిస్థాన్ జైలులో బందీగా ఉన్నాడని సదరు లేఖలో పోలీసులు పేర్కొనడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చనిపోయాడనుకున్న కుమారుడు బతికే ఉన్నాడని తెలియడంతో ఛావీ కుటుంసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఛావీ పాకిస్థాన్లో ఏ జైలులో ఉన్నాడనే విషయంపై కచ్చితమైన సమాచారం అందాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మతిస్థిమితం లేకపోవడం వల్ల ఛావీ సరిహద్దు దాటి పాకిస్థాన్ బలగాలకు చిక్కి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతడి ఆచూకీని వీలైనంత త్వరగా కనుక్కుని భారత్కు తిరిగి రప్పిస్తామని కుటుంబసభ్యులకు పోలీసులు హామీ ఇచ్చారు.

తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!