YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఓటర్ల ధృవీకరణ ప్రక్రియను మరింత ఓటర్ ఫ్రెండ్లీగా మార్చాలని వైఎస్సార్సీపీ భారత ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు లేఖ రాశారు. అన్మ్యాప్డ్, మిస్మ్యాచ్డ్ ఓటర్ల ధృవీకరణలో పలు కీలక మార్పులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓటరు స్వయంగా హాజరు కాలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేదా రక్త సంబంధీకుల ద్వారా అవసరమైన పత్రాలను సమర్పించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఉద్యోగం, చదువు, వలస కూలీలుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు కూడా వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఓటరు తరఫున పత్రాలు సమర్పించే బంధువులకు రిలేషన్షిప్ ప్రూఫ్, అధికారిక అనుమతితో అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.
అలాగే వెరిఫికేషన్ నోటీసుల్లో ధృవీకరణ జరిగే ప్రదేశం, తేదీ, సమయం, సంబంధిత అధికారి వివరాలను స్పష్టంగా పేర్కొనాలని వైఎస్సార్సీపీ కోరింది. వెరిఫికేషన్ ప్రదేశం వివరాలు లేకుండా నోటీసులు జారీ చేయడం వల్ల ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. బూత్ లెవల్ ఆఫీసర్ల (BLO) ద్వారా స్థానికంగానే ఓటర్ల ధృవీకరణకు అవకాశం కల్పించాలని, పత్రాల స్వీకరణతో పాటు ప్రాథమిక, ఫీల్డ్ వెరిఫికేషన్లోనూ BLOలను భాగస్వామ్యం చేయాలని సూచించింది. ప్రతి ఓటరు ఉన్నతస్థాయి ఎన్నికల అధికారిని వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం లేకుండా స్థానిక స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే వ్యవస్థ ఉండాలని కోరింది.
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఎస్ఈసీకి వల్లభనేని లేఖ..
ఇదిలా ఉండగా, SIR ప్రక్రియలో గన్నవరం నియోజకవర్గంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు లేఖ రాశారు. బూత్ల వారీగా 32,524 మంది ఓటర్ల జాబితాను సమర్పించలేదని ఆయన పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని 24 నుంచి 70 వరకు ఉన్న పోలింగ్ స్టేషన్లలో పునఃపరిశీలన లేదా ఆడిట్ ఎందుకు జరగలేదో వివరించలేదని వంశీ తన లేఖలో పేర్కొన్నారు. ప్రసాదంపాడులోని 58, 59, 53 పోలింగ్ స్టేషన్లలో ‘నో మ్యాపింగ్’ కేసులు అసమానంగా ఉన్నాయని తెలిపారు. ఓటర్ల ధృవీకరణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని వైఎస్సార్సీపీ కోరింది. కేవలం ప్రక్రియాపరమైన ఇబ్బందులు, నియోజకవర్గానికి దూరంగా ఉండటం లేదా నోటీసులో స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో ఒక్క నిజమైన ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకూడదని ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!