Bihar: బీహార్లోని జాముయి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్తో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ని తొక్కించి చంపేశారు. ఈ ఘటనలో హోంగార్డుతో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం వీరికి ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటన జముయ్ లోని మహులియా తాండ్ గ్రామంలో చోటు చేసుకుంది. చనిపోయిన ఎస్సై ప్రభాత్ రంజన్గా గుర్తించారు. అతని సొంత జిల్లా సవాయ్ కాగా.. గర్హి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. ఘటన తర్వాత అతనిని…
బీహార్లోని కైమూర్లో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో స్నానానికి దిగి ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు అబ్బాయిలు ఉండగా.. ఒక అమ్మాయి ఉంది. స్థానికులు చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దు:ఖ సాగరంలో నిండిపోయింది.
బీహార్లోని ఓ గ్రామంలో ఎంత ప్రయత్నించినా అక్కడి అబ్బాయిలకు మ్యారేజ్ లు జరగటం లేదట. జముయి జిల్లా సదర్ ప్రధాన కార్యాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరుఅట్టా విలేజ్ లో అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి మాత్రం చాలా కష్టపడుతున్నారంట. ఈ ఊరి యువకులు ఉద్యోగాల కంటే పెళ్లి చేసుకోవడానికే ఎక్కువగా కష్టపడుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
Bihar: సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కార్ కీలక రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బీహార్లోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన ‘రిజర్వేషన్ సవరణ బిల్లు’ను ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రంలోని ఇతర వెనకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోటాను పెంచే బిల్లుకు మంగళవారం బీహార్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.
CM Nitish Kumar: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ అసెంబ్లీలో జనాభా నియంత్రణ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ కూడా ఆయన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న నితీష్ కుమార్.. తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని కోరారు.
PM Modi: జనాభా నియంత్రణ గురించి బీహార్ అసెంబ్లీలో నిన్న సీఎం నితీష్ కుమార్ మాట్లాడటం వివాదాస్పదం అయ్యాయి. మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా నితీష్ వ్యవహరించడంపై పలువురు మహిళా ప్రజాప్రతినిధులతో పాటు విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీంతో తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని ఈ రోజు సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.
CM Nitish Kumar: కులగణన, రిజర్వేషన్ల అంశంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడున్న రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చర్చ సందర్భంగా నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘జనాభా నియంత్రణ’పై ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే జేడీయూ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీలు మాత్రం నితీష్ కుమార్కి మద్దతు తెలుపుతున్నాయి.
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరిగిన కులగణనలో ఉద్దేశపూర్వకంగా ముస్లింలు, యాదవుల జనాభాను పెంచారని, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Bihar: సాధారణంగా రోడ్లు బాగాలేవని.. గతుకులు, గుంతలతో రోడ్డు అద్వానంగా తయారైన అధికారా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆందోళనలు చేయడం మనం చూస్తుంటాము. కానీ ప్రభుత్వం ప్రజలకు మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో.. కనీసం సరైన రోడ్డు సౌకర్యం అయినా కల్పించాలి అనుకుంటే ప్రభుత్వానికి సహకరించని ప్రజలు ఎక్కడైనా ఉంటారా..? అంటే ఉన్నారు అని వీళ్ళని చూస్తే తెలుస్తుంది. ఓ వైపు రోడ్డు పనులు జరుగుతూ ఉంటె.. మరో వైపు నుండి…
People Jumps with Liquor Bottles after Car Meets Accident In Gaya: అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురికాగా.. అందులో ఉన్న బాటిళ్లను జనాలు ఎత్తుకెళ్లారు. కారు నిండా ఉన్న విదేశీ మద్యం బాటిళ్లను తీసుకుని జనాలు పరుగులు తీశారు. ఈ ఘటన బీహార్లోని గయా జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెట్టింట వైరల్గా మారిన వీడియోల ద్వారా విషయం తెలుసుకున్న…