BJP: త్వరలో లాలూ, నితీష్ కుమార్ పార్టీలు విలీనం.. బాంబు పేల్చిన కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: బీహార్ రాజకీయంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పార్టీ జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీలు త్వరలో విలీనం అవుతాయంటూ కేంద్రమంత్రి శనివారం వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. జనవరిలోగా లోక్సభ ఎన్నికల ముందు సీట్ల పంపకాలపై ఏర్పాట్లు చేయాలని ఇండియా కూటమికి నితీష్ కుమార్ చెప్పడంపై మీడియా ప్రశ్నించడంతో గిరిరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Salaar vs Dunki: ఇక కదా కిక్కంటే.. డుంకీ డే 1 మొత్తాన్ని ఓవర్సీస్ లో కొట్టేశాడు ప్రభాస్!
Also Read
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
త్వరలోనే ఆర్జేడీలో జేడీయూ విలీనం అవుతోందని లాలూ తనకు చెప్పాడని, దీంతో సీట్ల షేరింగ్ తలెత్తదని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు గిరిరాజ్ సింగ్, ఇండియా కూటమి సమావేశానికి రావడానికి లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ ఢిల్లీ వచ్చేందుకు ఒకే విమానం ఎక్కారు. కొడుకు తేజస్వీ యాదవ్ని బీహార్ ముఖ్యమంత్రిని చేసేందుకు సమయం ఆసన్నమైందని లాలూ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యల్ని జేడీయూ, ఆర్జేడీ నేతలు తిప్పికొట్టారు.
గతంలో సీఎం నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉండేవారు. అయితే గతేడాది బీజేపీకి గుడ్ బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో బీహార్లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నితీష్, లాలూ ఇద్దరూ ఇండియా కూటమిలో కీలక సభ్యులుగా ఉన్నారు. ఇండియా కూటమి తొలి సమావేశాన్ని నితీష్ కుమార్ పాట్నాలో నిర్వహించారు.
- Tags
- bihar
- bjp
- Giriraj Singh
- INDIA Bloc
- JDU
తాజావార్తలు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!