Bihar: “తల్లిని మించిన యోధులు లేరు”.. ప్రాణాలను అడ్డుపెట్టి పిల్లల్ని రక్షించింది.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: తల్లికి మించిన యోధులు లేరు..ఓ సినిమాలోని డైలాగ్. నిజజీవితంలో కూడా తల్లి తన పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది. పెంచిపెద్ద చేసి ప్రయోజకులుగా మారుస్తుంది. తన పిల్లలను కాపాడుకునే విషయంలో మృత్యువుకు కూడా అడ్డుగా నిలుస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టైనా పిల్లల్ని కాపాడుకుంటుంది.
సరిగా ఇలాంటి సంఘటనే బీహార్ రాష్ట్రంలో జరిగింది. తన పిల్లల్ని రక్షించుకునేందుకు వారిపై పడుకుని రైలు ప్రమాదం నుంచి రక్షించింది. వెంట్రుకవాసిలో మరణం ముందున్న కూడా పిల్లల్ని కాపాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రంలోని బార్హ్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కింద పడిన పిల్లలను కాపాడుకునేందుకు తన ప్రాణాన్ని అడ్డేసింది ఆ తల్లి. ఈ ఘటన శనివారం జరిగింది.
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
Read Also: Salaar Collections: 300 కోట్లు… సెకండ్ డే కూడా సలారోడు సెన్సేషన్ క్రియేట్ చేసాడు
మహిళ, ఆమె పిల్లలు బెగుసరాయ్ నుంచి వచ్చారు. మహిళ తన కుటుంబంతో ఢిల్లీకి వెళ్లేందుకు భాగల్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే విక్రమశిలా ఎదురుచూస్తోంది. ఈ లోపు ట్రైన్ రావడంతో ఒక్కసారిగా జనాలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పిల్లలతో సహా మహిళ ట్రైన్ కింద పడింది. ప్లాట్ఫామ్, ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయింది. అదే సమయంలో ట్రైన్ కదలడంతో ఒక్కసారిగా తన పిల్లలకు ఏం కాకూడదని వారిపై పడుకుని, ట్రైన్కి పిల్లలకు మధ్య అడ్డుగోడలా నిలిచింది.
ట్రైన్ కింద పడిపోవడంతో స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ట్రైన్ మూవ్ కావడంతో తన పిల్లల్ని, తల్లి తన శరీరంతో కప్పి ఉంచింది. ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత మహిళను, పిల్లల్ని స్థానికులు రక్షించారు. చికిత్స నిమిత్తం వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
मौत के सामने जीती मां की ममता. #Bihar के #Barh रेलवे स्टेशन से वीडियो. भीड़ में मां, दो बच्चों संग पटरी पर गिरी. ट्रेन चलने लगी. 3 जिंदगियों के सामने मौत खड़ी थी. और दूसरी तरफ मां. उधर ट्रेन की रफ्तार थी. तो इधर मां की ममता. 25 सेकेंड बाद मां जीती. मौत हारी. #viralvideo #barh pic.twitter.com/bsDxbD0EFS
— Sunil Maurya (@smaurya_journo) December 24, 2023
తాజావార్తలు
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!