Bihar: “తల్లిని మించిన యోధులు లేరు”.. ప్రాణాలను అడ్డుపెట్టి పిల్లల్ని రక్షించింది.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: తల్లికి మించిన యోధులు లేరు..ఓ సినిమాలోని డైలాగ్. నిజజీవితంలో కూడా తల్లి తన పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది. పెంచిపెద్ద చేసి ప్రయోజకులుగా మారుస్తుంది. తన పిల్లలను కాపాడుకునే విషయంలో మృత్యువుకు కూడా అడ్డుగా నిలుస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టైనా పిల్లల్ని కాపాడుకుంటుంది.
సరిగా ఇలాంటి సంఘటనే బీహార్ రాష్ట్రంలో జరిగింది. తన పిల్లల్ని రక్షించుకునేందుకు వారిపై పడుకుని రైలు ప్రమాదం నుంచి రక్షించింది. వెంట్రుకవాసిలో మరణం ముందున్న కూడా పిల్లల్ని కాపాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రంలోని బార్హ్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కింద పడిన పిల్లలను కాపాడుకునేందుకు తన ప్రాణాన్ని అడ్డేసింది ఆ తల్లి. ఈ ఘటన శనివారం జరిగింది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Read Also: Salaar Collections: 300 కోట్లు… సెకండ్ డే కూడా సలారోడు సెన్సేషన్ క్రియేట్ చేసాడు
మహిళ, ఆమె పిల్లలు బెగుసరాయ్ నుంచి వచ్చారు. మహిళ తన కుటుంబంతో ఢిల్లీకి వెళ్లేందుకు భాగల్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే విక్రమశిలా ఎదురుచూస్తోంది. ఈ లోపు ట్రైన్ రావడంతో ఒక్కసారిగా జనాలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పిల్లలతో సహా మహిళ ట్రైన్ కింద పడింది. ప్లాట్ఫామ్, ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయింది. అదే సమయంలో ట్రైన్ కదలడంతో ఒక్కసారిగా తన పిల్లలకు ఏం కాకూడదని వారిపై పడుకుని, ట్రైన్కి పిల్లలకు మధ్య అడ్డుగోడలా నిలిచింది.
ట్రైన్ కింద పడిపోవడంతో స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ట్రైన్ మూవ్ కావడంతో తన పిల్లల్ని, తల్లి తన శరీరంతో కప్పి ఉంచింది. ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత మహిళను, పిల్లల్ని స్థానికులు రక్షించారు. చికిత్స నిమిత్తం వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
मौत के सामने जीती मां की ममता. #Bihar के #Barh रेलवे स्टेशन से वीडियो. भीड़ में मां, दो बच्चों संग पटरी पर गिरी. ट्रेन चलने लगी. 3 जिंदगियों के सामने मौत खड़ी थी. और दूसरी तरफ मां. उधर ट्रेन की रफ्तार थी. तो इधर मां की ममता. 25 सेकेंड बाद मां जीती. मौत हारी. #viralvideo #barh pic.twitter.com/bsDxbD0EFS
— Sunil Maurya (@smaurya_journo) December 24, 2023
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..