DMK MP Dayanidhi Maran: “హిందీ మాట్లాడేవాళ్లు టాయిలెట్లు క్లీన్ చేస్తారు”.. డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై బీహార్ డిప్యూటీ సీఎం ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK MP Dayanidhi Maran: ఉత్తరాది వాళ్ల గురించి మరోసారి డీఎంకే పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడే వాళ్లు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు ఆర్జేడీ నేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఫైర్ అవుతున్నారు.
డీఎంకే ఎంపీ దయానిధి వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాల స్పందించారు. యూపీ, బీహార్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు డీఎంకే పార్టీతో పాటు ఇండియా కూటమి నేతలను దుయ్యబట్టారు. డీఎంకే నేతలు బీహార్ ప్రజలను అవమానపరచడం మానేయాలని బీజేపీ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇండియా కూటమిలోని నేత, సీఎం నితీష్ కుమార్ వల్లే.. బీహార్ ప్రజలు తమిళనాడు వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమి నేతలు ప్రజల్ని కులం, భాష, మతాల వారీగా విభజించేందుకు ప్రయత్నిస్తోందని పూనావాల ఆరోపించారు. డీఎంకే వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారని ప్రశ్నించారు.
Also Read
- Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
Read Also: WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త పాలక వర్గం సస్పెండ్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం..
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్ నేర్చుకున్న వారితో హిందీ మాట్లాడే వారిని పోల్చుతూ.. ఇంగ్లీష్ మాట్లాడేవారు పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ, లక్షలు సంపాదిస్తున్నారని, హిందీ మాట్లాడే బీహార్, యూపీ వాళ్ల తమిళనాడులో చిన్న ఉద్యోగాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసినా కూడా తప్పుపట్టాల్సిందే అని అన్నారు. ఈ దేశమంతా ఒక్కటే అని ఇతర రాష్ట్రాలను గౌరవించాలని అన్నారు.
అంతకుముందు 5 రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన తర్వాత డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గోమూత్ర రాష్ట్రాల్లో గెలుస్తుందంటూ ఎద్దేవా చేశారు. దీనిపై ఆ తర్వాత అతను క్షమాపణలు చెప్పారు. అంతకుముందు డీఎంకే కీలక నేత, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాలతో పోలుస్తూ, దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించడం కూడా వివాదాస్పదం అయింది.
తాజావార్తలు
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!