హిందూ దేవుళ్లపై ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో శివ భవానీ సేన అనే హిందూ సంస్థ సదరు ఆర్జేడీ ఎమ్మెల్యే నాలుక కోసేస్తే 10 లక్షల రూపాయల రివార్డును అందజేస్తామంటూ పోస్టర్లను అంటించింది.
బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదు ఇళ్లు దగ్ధం కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆస్తులు వివరాలను క్యాబినెట్ సెక్రటేరియట్ విడుదల చేసింది. 2023 డిసెంబర్ 31 వరకు విడుదల చేసిన ఈ ప్రకటనలో.. చర, స్థిరాస్తి నుండి రుణాల వరకు ప్రతిదీ చర్చించబడింది. సీఎం నితీష్ కుమార్ కు రూ.1.64 కోట్ల ఆస్తులున్నాయి. అతని వద్ద రూ.22,552 నగదు, రూ.49,202 వివిధ బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. కాగా.. ఈసారి నితీష్ కుమార్ తన కుమారుడి పేరు మీద ఉన్న ఆస్తి గురించి సమాచారం ఇవ్వలేదు. ఇదిలా…
బీహార్లోని నవాడాలో సైబర్ మోసం పతాక స్థాయికి చేరుకుంది. గర్భం దాల్చలేని మహిళలను గర్భం దాల్చేందుకు ఒక ఏజెన్సీని నడుపుతున్న ముఠాను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
ఈ వారం అంతా చెలరేగిన ఊహాగానాలను ధృవీకరిస్తూ శుక్రవారం జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్ష పదవికి లాలన్ సింగ్ రాజీనామా చేశారు. 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టారు.
Bihar: తల్లికి మించిన యోధులు లేరు..ఓ సినిమాలోని డైలాగ్. నిజజీవితంలో కూడా తల్లి తన పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది. పెంచిపెద్ద చేసి ప్రయోజకులుగా మారుస్తుంది. తన పిల్లలను కాపాడుకునే విషయంలో మృత్యువుకు కూడా అడ్డుగా నిలుస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టైనా పిల్లల్ని కాపాడుకుంటుంది.
ఈ ఘటనపై ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ ఘటన బాధాకరమని, కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వం నేరాలను సహించదని, దోషులను కటకటాల వెనకకి పంపుతామని అన్నారు. మరోవైపు బీజేపీ ఈ ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది.
DMK MP Dayanidhi Maran: ఉత్తరాది వాళ్ల గురించి మరోసారి డీఎంకే పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడే వాళ్లు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు ఆర్జేడీ నేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఫైర్ అవుతున్నారు.
BJP: బీహార్ రాజకీయంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పార్టీ జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీలు త్వరలో విలీనం అవుతాయంటూ కేంద్రమంత్రి శనివారం వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.