Rahul Gandhi: దేశంలో తొలిసారిగా బీహార్ రాష్ట్రం కులాల వారీగా సర్వే చేసింది. కుల గణన ఫలితాలను ఈ రోజు వెల్లడించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం చేసిన ఈ పనిని కాంగ్రెస్ స్వాగతించింది. సామాజిక న్యాయం చేయడానికి, సామాజిక సాధికారత కోసం జాతీయ స్థాయిలో ఇలాంటి కసరత్తు చేయాలని కేంద్రాన్ని కోరింది.
బీహార్లో కులగణన సర్వే నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు (OBCs), అత్యంత వెనుకబడిన తరగతులు (Extremely Backward Classes- EBCs) కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉన్నట్లు నివేదికలో తేలింది.
బైక్ దొంగిలిచాడని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన బీహార్లోని వైశాలిలో జరిగింది. స్థానికులు చెట్టుకు కట్టేసి రక్తమొచ్చేటట్టు చితకబాదారు. అతన్ని అలా కొడుతుండగా.. కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని చెట్టు నుంచి విడిపించారు.
Ambulance stopped 1 Hour for Bihar CM Nitish Kumar’s Convoy: తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిన్నారిని తరలిస్తున్న అంబులెన్స్ను సుమారు గంట పాటు పోలీసు అధికారులు ఆపేశారు. సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్స్ను ఆసుపత్రికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన పాట్నాలో శనివారం చోటుచేసుకుంది. పాట్నా సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం అంబులెన్స్ను ఆపడంతో.. అనారోగ్యంతో ఉన్న చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఈ ఘటనకు సంబందించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో…
బీహార్లోని దర్భంగాలో హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై మహిళా పోలీసు అధికారి లాఠీచార్జి చేసింది. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా భాగల్పూర్లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని చెప్పుతో చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు కానిస్టేబుల్తో గొడవ పడి.. కానిస్టేబుల్ యూనిఫాం చించేశాడు.
బీహార్ లోని పిదాసిన్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు నిరంజన నదిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి గల్లంతయ్యారు. వారిలో ఒకరిని స్థానికులు కాపాడార. అయితే చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. మరోవైపు నదిలో గల్లంతైన ఇద్దరు బాలికల కోసం గాలిస్తున్నారు.
బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. 3 అడుగుల భూమి విషయంలో ఓ వ్యక్తిని చితకబాది.. అనంతరం చెవి కోసేశారు. గ్రామానికి చెందిన కొందరు బడా బాబులు తన భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. దీంతో బాధితుడు నిరసన తెలపడంతో అతనిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బీహార్లోని బెగుసరాయ్ జిల్లా లఖో పోలీస్ స్టేషన్ పరిధిలో శివాలయంలో ఉన్న శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై.. NH 31 జాతీయ రహదారిపై తీవ్ర గందరగోళం సృష్టించారు.