అందరూ అనుకున్నదే నిజమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతోన్న రోహిత్కు మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. దాంతో ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఐదవ టెస్టులో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు బుమ్రా చెప్పాడు. శుభ్మన్ గిల్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు. రోహిత్ స్థానంలో గిల్, ఆకాష్ దీప్…
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించిన టీమిండియా బౌలర్గా నిలిచాడు. బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 907 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో సంచలన ప్రదర్శనకు గాను ఈ రికార్డు బుమ్రా ఖాతాలో చేరింది. ఈ ట్రోఫీలో ఇప్పటివరకు 4 టెస్ట్ మ్యాచ్లు ఆడి 30 వికెట్స్ పడగొట్టాడు. తాజా ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్లో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత మాజీ స్పిన్నర్…
కెప్టెన్ కావడం వల్లే రోహిత్ శర్మ తుది జట్టులో ఉంటున్నాడని టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. కెప్టెన్గా లేకపోతే ప్లేయింగ్ ఎలెవన్లో రోహిత్ స్థానం ప్రశ్నార్థకంగా మారేదన్నాడు. హిట్మ్యాన్ బ్యాటర్గా తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. రోహిత్ గత కొన్ని నెలలుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. కివీస్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో ఒక హాఫ్ సెంచరీ మినహా రాణించలేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో కనీసం 20, 30 పరుగులు కూడా చేయట్లేదు.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజ్లో రిషబ్ పంత్ (6), రవీంద్ర జడేజా (4)లు ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 474 పరుగులు చేసింది. భారత్ ఇంకా…
రోహిత్ శర్మ కెప్టెన్సీపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఫైర్ అయ్యారు. సారథిగా రోహిత్ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా లేవని, బౌలర్లను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టులో ఇద్దరు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని, 40 ఓవర్ల తర్వాత బౌలింగ్కు తీసుకురావడం అవసరమా? అని ప్రశ్నించారు. ఫీల్డింగ్ సెటప్ కూడా సరిగ్గా లేదని రవిశాస్త్రి మండిపడ్డారు. మెల్బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్…
టీమిండియా అంటేనే రెచ్చిపోయే బ్యాటరలలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో భారత బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. భారత జట్టుపై స్మిత్ హాఫ్ సెంచరీ, సెంచరీలను అలవోకగా బాదేస్తున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో గబ్బాలో జరిగిన మూడో టెస్ట్లో శతకం బాదిన స్మిత్.. ప్రస్తుతం మెల్బోర్న్లో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ చేశాడు. స్మిత్కు ఇది టెస్ట్ కెరీర్లో 34వ సెంచరీ. అదేసమయంలో మెల్బోర్న్లో ఐదవ శతకం.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (140) సెంచరీ చేయగా.. సామ్ కాన్స్టాస్ (60), ఉస్మాన్ ఖవాజా (57), మార్నస్ లబుషేన్ (72) హాఫ్ సెంచరీలు బాదారు. కెప్టెన్ పాట్ కమిన్స్ (49) తృటిలో అర్ధ శతకం కోల్పోయాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా ఆటగాళ్లు నల్ల బ్యాడ్జ్లతో బరిలోకి దిగారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు ఎడమ చేతికి నల్ల బ్యాడ్జ్లను ధరించారు. రెండో రోజు మొత్తం ప్లేయర్స్ అందరూ నల్ల బ్యాడ్జ్లతో ఆడనున్నారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ వయో సంబంధిత సమస్యల కారణంగా గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. Also…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్టేడియంలోని ఓ అభిమాని బారికేడ్లు దాడి మరీ మైదానంలోకి దూసుకొచ్చి.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఆలింగనం చేసుకొనేందుకు ప్రయత్నించాడు. హగ్ చేసుకొనేందుకు కుదరకపోవడంతో.. కోహ్లీపై చేయి వేసి పోజులు ఇచ్చాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి.. ముందుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆసీస్ బ్యాటర్లు మొదటి రోజులో హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. రెండో రోజులో కూడా చెలరేగి ఆడుతున్నారు. ఈ క్రమంలో రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 454/7 పరుగులు చేసింది. క్రీజ్లో స్టీవ్ స్మిత్ (139), మిచెల్ స్టార్క్ (15) ఉన్నారు. ఈ సెషన్లో ఆసీస్ బ్యాటర్లు 27 ఓవర్లలో 143 పరుగులు చేయడం విశేషం. భారత బౌలర్లు…