DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం కాలంలో ‘‘కార్లు లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయడం లేదు’’ అని అన్నారు. బెంగళూర్లో టన్నెల్ రోడ్ ప్రాజెక్టును సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం అంతా ఉలిక్కి పడేలా చేసింది.. ఈ ఘటనతో అసలు ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారు..? ప్రయాణికుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయే విమర్శలు కూడా వచ్చాయి.. అయితే, ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.. బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్, ఆర్సీ, బీమా, పర్మిట్, పన్ను, డబుల్ డ్రైవర్, ఎస్కార్ట్ ఫైర్ ఎక్స్టింజిషర్ తో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఇలా.. క్షుణ్ణంగా…
Actor Divya Suresh: హిట్ అండ్ రన్ కేసులో బిగ్ బాస్ బ్యూటీపై కేసు నమోదైంది.. కన్నడ బిగ్ బాస్ ద్వారా కర్ణాటకలో బాగా ఫేమస్ అయిన నటి దివ్య సురేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.. బెంగుళూరులో యాక్సిడెంట్ చేసి పరారైన దివ్య సురేషపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు.. ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బైతరాయణపురలోని ఎంఎం రోడ్డులో ప్రమాదం చోటు…
Karnataka: కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇటీవల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూర్ సౌత్ ఎంపీ, బీజేపీ తేజస్వీ సూర్యను ‘‘అమావాస్య’’గా పిలిచారు. దీనికి తేజస్వీ స్పందిస్తూ.. సీఎం సిద్ధరామయ్య ‘‘కర్ణాటకకు గ్రహణం’’ అని అన్నారు. సిద్ధరామయ్య పాలన రాష్ట్రానికి గ్రహణం లాంటిది అని విమర్శించారు. Read Also: CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అత్యవసర నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు.. తనను అమావాస్య, పౌర్ణమిగా…
టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ(27)పై ఐదుగురు సభ్యులతో కూడిన బృందం సామూహిక అత్యాచారానికి పాల్పడింది. అనంతరం ఇంట్లో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. నిందితులు.. మహిళను బెదిరించి సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఇంట్లో నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.25,000 నగదు ఎత్తుకెళ్లారు.
బెంగళూరులో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో లివ్-ఇన్ జంట అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆనేకల్లోని కల్లబాలులోని ఓ ఇంట్లో శవాలుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరు రోడ్లపై వివాదం తలెత్తిన వేళ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ను బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తన మేనల్లుడి వివాహానికి రావాల్సిందిగా శివకుమార్ను ఆహ్వానించారు. అంతకుముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు.
బెంగళూరులో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి ఒక విద్యాకుసుమం రాలిపోయింది. కాలేజీలో జరిగిన పరీక్షకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా దుండగుడు కత్తితో తెగబడడంతో తీవ్ర రక్తస్రావమై విద్యార్థిని కుప్పకూలి ప్రాణాలు వదిలింది. శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో ఈ ఘతుకం జరిగింది.
వారిద్దరూ వైద్య వృత్తిలో ఉన్నారు. చూడచక్కని జంట. ఇంకేముంది పెళ్లితో చక్కని జంట అవుతుందని పెద్దవాళ్లు భావించారు. ఇద్దరికి గ్రాండ్గా వివాహం జరిపించారు. కానీ ఏడాది తిరగకుండానే భార్యను కాటికి పంపేశాడు దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. వైద్య వృత్తికే మాయని మచ్చగా మిగిలిపోయింది.
Bengaluru: ‘‘అథితి దేవోభవ’’ అని చెబుతుంటారు పెద్దలు. కానీ కర్ణాటకలో మాత్రం కొందరు విపరీతమైన భాషా దురాభిమానంతో వ్యవహరిస్తున్నారు. కన్నడేతరుల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. వేరే రాష్ట్రాల నుంచి బెంగళూర్ లేదా ఇతర కర్ణాటక ప్రాంతాలకు వెళ్లే వారిని బలవంతంగా ‘‘కన్నడ’’ మాట్లాడాలని వేధిస్తున్నారు. ఈ జాడ్యం ఇతర రాష్ట్రాల వారిపై దాడి చేసేదాకా వెళ్లింది. ఇక ఉబర్, ఓలా వంటి ట్యాక్సీలను బుక్ చేసుకున్న తర్వాత ఇలాంటి సంఘటనలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ప్రయాణికులకు అర్థంకాని…