Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం ఎఫెక్ట్..! ట్రావెల్స్ బుకింగ్స్ రద్దు.. ఆర్టీసీకి పెరిగిన గిరాకీ..
- ప్రైవేట్ ట్రావెల్స్ పై కర్నూలు బస్సు ప్రమాదం ఎఫెక్ట్..
- ఫిట్నెస్ లేని బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేత..
- ముందుగా బుక్ చేసిన టికెట్లు సైతం రద్దు..
- ట్రావెల్స్ బస్సులు బుకింగ్స్ రద్దు చేయడంతో ఆర్టీసీకి పెరిగిన గిరాకీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం అంతా ఉలిక్కి పడేలా చేసింది.. ఈ ఘటనతో అసలు ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారు..? ప్రయాణికుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయే విమర్శలు కూడా వచ్చాయి.. అయితే, ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.. బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్, ఆర్సీ, బీమా, పర్మిట్, పన్ను, డబుల్ డ్రైవర్, ఎస్కార్ట్ ఫైర్ ఎక్స్టింజిషర్ తో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఇలా.. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రవాణా శాఖ అధికారులు.. మరోవైపు, కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమానుల్లో కాస్త చలనం వచ్చినట్టుగా కనిపిస్తోంది.. ఫిట్నెస్ లేని బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు ఆయా ట్రావెల్స్ యాజమాన్యాలు.. దీంతో, ముందుగా బుక్ చేసిన టికెట్లను సైతం రద్దు చేస్తున్నారు..
Read Also: Ind vs Aus 3rd ODI: ఆసీస్ను కంగారు పెట్టిన టీమిండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..?
Also Read
సాధారణంగా వీకెండ్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్లో భారీగా బుకింగ్స్ ఉంటాయి.. వీకెండ్ కోసం ముందే బుక్ చేసుకునేవాళ్లు కూడా ఉంటారు.. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తున్న బస్సులపై ఆర్టీఏ చర్యలు ప్రారంభించింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరులోనూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు, సీజ్లు కొనసాగుతున్నాయి.. తెలంగాణలో వారం రోజుల ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్లు కొనసాగనున్నాయి.. ఈ నేపథ్యంలో.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బుకింగ్స్ రద్దు చేస్తున్నాయి.. ప్రయాణికులకు డబ్బులను రీఫండ్ చేస్తున్నాయి.. దీంతో, ఆర్టీసీ బస్సులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?