Darshan Case: కన్నడ స్టార్ దర్శన్, పవిత్ర గౌడలపై హత్య, కుట్ర అభియోగాలు..
- రేణుకా స్వామి కేసులో కీలక పరిణామం..
- దర్శన్, పవిత్ర గౌడ మీద హత్య, కుట్ర అభియోగాలు..
- నవంబర్ 10 నుంచి విచారణ ప్రారంభం..
Darshan Case: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసు సంచలనంగా మారింది. తన అభిమాని రేణుకాస్వామని దారుణంగా హింసించి, హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్య కేసులో దర్శన్తో పాటు పవిత్ర గౌడ కీలక నిందితులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే, రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మందిపై బెంగళూర్లోని 65వ సెషన్స్ కోర్టు సోమవారం హత్య, నేరపూరిత కుట్ర, కిడ్నాప్, చట్టవిరుద్ధమైన సమావేశం వంటి అభియోగాలు మోపింది. ఈ కేసు విచారణ నవంబర్ 10న ప్రారంభం అవుతుంది.
చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి(35) దర్శన్ అభిమాని. అయితే, దర్శన్లో రిలేషన్లో ఉన్న పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యకరమైన మేజేజ్లు పంపించడంతో, అతడిని కిడ్నాప్ చేసి, హింసించడంతో ఆయన మరణించారు. జూన్ 9, 2024న బెంగళూర్లోని ఒక నీటి కాలువ వద్ద రేణుకా స్వామి మృతదేహం కనిపించింది. ఈ కేసుపై సోమవారం కిక్కిరిసిన కోర్టు హాలులో అభియోగాలు మోపబడ్డాయి.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
Read Also: Pakistan: పాక్ ఆర్మీ, ప్రభుత్వం మధ్య విభేదాలు.. ఆఫ్ఘాన్తో ఘర్షణ పెంచుతున్న ఆసిమ్ మునీర్..
న్యాయమూర్తి మొదటి నిందితురాలు పవిత్ర గౌడపై అభియోగాలు చదివి వినిపించారు. ‘‘రేణుకస్వామి ఆమెకు అశ్లీల సందేశాలు పంపారని, ఆ తర్వాత అతన్ని కిడ్నాప్ చేసి, బెంగళూరులోని ఒక షెడ్కు తీసుకెళ్లి దాడి చేశారని కోర్టు గమనించింది. అతన్ని చెప్పులు, చెక్క పలకతో కొట్టారు, ప్రాణాంతక గాయాలు చేశారు’’ అని న్యాయమూర్తి కోర్టులో చదివి వినిపించారు.
ఆరోపణల ప్రకారం..‘‘ పవిత్ర రేణుకాస్వామిని చెప్పుతో కొట్టగా, దర్శన్ అతడి ప్యాంట్ తొలగించి, అతడి ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. ఇది అతడి మరణానికి దారి తీసింది. నిందితుల్లో కొంతమందిని నేరస్తులుగా చిత్రీకరించేందుకు వారిని డబ్బుతో ప్రలోభపెట్టారు’’ అని కోర్టు పేర్కొంది. 17 మంది నిందితులు నేరాన్ని అంగీకరించేందుకు నిరాకరించారు. దీంతో ఈ కేసుపై కోర్టు విచారణ మొదలుకానుంది. అభియోగాలు మోపిన తర్వాత దర్శన్, పవిత్ర గౌడ, మరో ఏడుగురు నిందితులను జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?