Darshan Case: కన్నడ స్టార్ దర్శన్, పవిత్ర గౌడలపై హత్య, కుట్ర అభియోగాలు..
- రేణుకా స్వామి కేసులో కీలక పరిణామం..
- దర్శన్, పవిత్ర గౌడ మీద హత్య, కుట్ర అభియోగాలు..
- నవంబర్ 10 నుంచి విచారణ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Case: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసు సంచలనంగా మారింది. తన అభిమాని రేణుకాస్వామని దారుణంగా హింసించి, హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్య కేసులో దర్శన్తో పాటు పవిత్ర గౌడ కీలక నిందితులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే, రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మందిపై బెంగళూర్లోని 65వ సెషన్స్ కోర్టు సోమవారం హత్య, నేరపూరిత కుట్ర, కిడ్నాప్, చట్టవిరుద్ధమైన సమావేశం వంటి అభియోగాలు మోపింది. ఈ కేసు విచారణ నవంబర్ 10న ప్రారంభం అవుతుంది.
చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి(35) దర్శన్ అభిమాని. అయితే, దర్శన్లో రిలేషన్లో ఉన్న పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యకరమైన మేజేజ్లు పంపించడంతో, అతడిని కిడ్నాప్ చేసి, హింసించడంతో ఆయన మరణించారు. జూన్ 9, 2024న బెంగళూర్లోని ఒక నీటి కాలువ వద్ద రేణుకా స్వామి మృతదేహం కనిపించింది. ఈ కేసుపై సోమవారం కిక్కిరిసిన కోర్టు హాలులో అభియోగాలు మోపబడ్డాయి.
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
- Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
Read Also: Pakistan: పాక్ ఆర్మీ, ప్రభుత్వం మధ్య విభేదాలు.. ఆఫ్ఘాన్తో ఘర్షణ పెంచుతున్న ఆసిమ్ మునీర్..
న్యాయమూర్తి మొదటి నిందితురాలు పవిత్ర గౌడపై అభియోగాలు చదివి వినిపించారు. ‘‘రేణుకస్వామి ఆమెకు అశ్లీల సందేశాలు పంపారని, ఆ తర్వాత అతన్ని కిడ్నాప్ చేసి, బెంగళూరులోని ఒక షెడ్కు తీసుకెళ్లి దాడి చేశారని కోర్టు గమనించింది. అతన్ని చెప్పులు, చెక్క పలకతో కొట్టారు, ప్రాణాంతక గాయాలు చేశారు’’ అని న్యాయమూర్తి కోర్టులో చదివి వినిపించారు.
ఆరోపణల ప్రకారం..‘‘ పవిత్ర రేణుకాస్వామిని చెప్పుతో కొట్టగా, దర్శన్ అతడి ప్యాంట్ తొలగించి, అతడి ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. ఇది అతడి మరణానికి దారి తీసింది. నిందితుల్లో కొంతమందిని నేరస్తులుగా చిత్రీకరించేందుకు వారిని డబ్బుతో ప్రలోభపెట్టారు’’ అని కోర్టు పేర్కొంది. 17 మంది నిందితులు నేరాన్ని అంగీకరించేందుకు నిరాకరించారు. దీంతో ఈ కేసుపై కోర్టు విచారణ మొదలుకానుంది. అభియోగాలు మోపిన తర్వాత దర్శన్, పవిత్ర గౌడ, మరో ఏడుగురు నిందితులను జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..