Bengaluru: అమానుషం.. రోడ్డుపై చిన్న ప్రమాదానికే యువకుడి ప్రాణం తీసిన దంపతులు
- బెంగళూరులో అమానుషం
- రోడ్డుపై చిన్న ప్రమాదానికే యువకుడి ప్రాణం తీసిన దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కిలోమీటర్కే కొన్ని గంటల సమయం పడుతుంది. ఇక బెంగళూరు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలకు నిలయం బెంగళూరు. ఎప్పుడూ ఫుల్ రష్ ఉంటుంది. ఇలాంటి రద్దీలో చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం సహజమే. కానీ ఒక జంట మాత్రం సీరియస్గా తీసుకుని ఓ యువకుడికి మరణశాసనం రాశారు. కారుతో వెంటాడి హతమార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Bihar Elections: ఊపందుకున్న బీహార్ ఎన్నికల ప్రచారం.. నేడు పలుచోట్ల మోడీ ర్యాలీలు
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
అక్టోబర్ 25న రాత్రి బెంగళూరు నగరంలోని పుట్టెనహళ్లి ప్రాంతంలో బైక్పై దర్శన్, అతని స్నేహితుడు వరుణ్ వెళ్తున్నారు. మార్గమధ్యలో కారు అద్దానికి బైక్ రాసుకుంది. అంతే కారులో ఉన్న దంపతులు మనోజ్ కుమార్, అతని భార్య ఆర్తి శర్మ సీరియస్గా తీసుకుని ఆవేశంతో బైక్ను 2 కిలోమీటర్ల మేర వెంటాడి ఢీకొట్టారు. దీంతో బైక్పై ఉన్న ఇద్దరూ కిందపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. కాసేపటికే దర్శన్ చనిపోగా.. స్నేహితుడు వరుణ్ మాత్రం తీవ్రగాయాలతో ఆస్పత్రిలో కొట్టిమిట్టాడుతున్నాడు. ఇక కారు వెంబడించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Trump-Jinping: 6 ఏళ్ల తర్వాత ట్రంప్-జిన్పింగ్ తొలిసారి భేటీ
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సీసీకెమెరాల్లో బైక్ను కారు ఢీకొట్టినట్లు కనిపించింది. దీంతో నిందితులు మనోజ్కుమార్, ఆర్తి శర్మను అరెస్ట్ చేశారు. ఇక వీడియోలో బైక్ను ఢీకొట్టి దంపతులు పారిపోయారు. అనంతరం తిరిగి ముసుగులు ధరించి విరిగిపోయిన భాగాలను తీసుకుని వెళ్లిపోయారు. తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు.. వీడియోను పరిశీలించాక హత్య కేసుగా నమోదు చేశారు. నిందితులపై హత్య అభియోగాలు నమోదు చేశారు. కేసును మరింత దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్గఢ్లో కీలక పరిణామం.. ఆయుధాలతో లొంగిపోయిన 21 మంది మావోలు

తాజావార్తలు
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..