Bengaluru: అమానుషం.. రోడ్డుపై చిన్న ప్రమాదానికే యువకుడి ప్రాణం తీసిన దంపతులు
- బెంగళూరులో అమానుషం
- రోడ్డుపై చిన్న ప్రమాదానికే యువకుడి ప్రాణం తీసిన దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కిలోమీటర్కే కొన్ని గంటల సమయం పడుతుంది. ఇక బెంగళూరు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలకు నిలయం బెంగళూరు. ఎప్పుడూ ఫుల్ రష్ ఉంటుంది. ఇలాంటి రద్దీలో చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం సహజమే. కానీ ఒక జంట మాత్రం సీరియస్గా తీసుకుని ఓ యువకుడికి మరణశాసనం రాశారు. కారుతో వెంటాడి హతమార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Bihar Elections: ఊపందుకున్న బీహార్ ఎన్నికల ప్రచారం.. నేడు పలుచోట్ల మోడీ ర్యాలీలు
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
అక్టోబర్ 25న రాత్రి బెంగళూరు నగరంలోని పుట్టెనహళ్లి ప్రాంతంలో బైక్పై దర్శన్, అతని స్నేహితుడు వరుణ్ వెళ్తున్నారు. మార్గమధ్యలో కారు అద్దానికి బైక్ రాసుకుంది. అంతే కారులో ఉన్న దంపతులు మనోజ్ కుమార్, అతని భార్య ఆర్తి శర్మ సీరియస్గా తీసుకుని ఆవేశంతో బైక్ను 2 కిలోమీటర్ల మేర వెంటాడి ఢీకొట్టారు. దీంతో బైక్పై ఉన్న ఇద్దరూ కిందపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. కాసేపటికే దర్శన్ చనిపోగా.. స్నేహితుడు వరుణ్ మాత్రం తీవ్రగాయాలతో ఆస్పత్రిలో కొట్టిమిట్టాడుతున్నాడు. ఇక కారు వెంబడించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Trump-Jinping: 6 ఏళ్ల తర్వాత ట్రంప్-జిన్పింగ్ తొలిసారి భేటీ
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సీసీకెమెరాల్లో బైక్ను కారు ఢీకొట్టినట్లు కనిపించింది. దీంతో నిందితులు మనోజ్కుమార్, ఆర్తి శర్మను అరెస్ట్ చేశారు. ఇక వీడియోలో బైక్ను ఢీకొట్టి దంపతులు పారిపోయారు. అనంతరం తిరిగి ముసుగులు ధరించి విరిగిపోయిన భాగాలను తీసుకుని వెళ్లిపోయారు. తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు.. వీడియోను పరిశీలించాక హత్య కేసుగా నమోదు చేశారు. నిందితులపై హత్య అభియోగాలు నమోదు చేశారు. కేసును మరింత దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్గఢ్లో కీలక పరిణామం.. ఆయుధాలతో లొంగిపోయిన 21 మంది మావోలు

తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!