bcci introduced new category for umpires: అంపైర్ల కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అంపైరింగ్లో సమర్ధత ఆధారంగా నాలుగు కేటగిరీలు ఉండేవి. ఉత్తమ పనితీరు ఆధారంగా ‘ఏ’, ‘బి’, ‘సి’, ‘డి’ కేటగిరీల ద్వారా అంపైర్లకు స్థానం కల్పించేవారు. అయితే కొత్తగా అంపైరింగ్ విధులను అత్యంత సమర్థతతో నిర్వర్తించే వాళ్ల కోసం బీసీసీఐ కొత్త కేటగిరీ ఏ+ ఏర్పాటు చేసింది. కొత్త కేటగిరి ఏ+లో 11 మంది అంపైర్లకు స్థానం కల్పించింది. ఈ…
Team India Reached West indies: టీమిండియా వరుసబెట్టి సిరీస్ల మీద సిరీస్లు ఆడుతోంది. ఇటీవల ఇంగ్లండ్తో టెస్ట్, వన్డే, టీ20 సిరీస్లు ఆడిన టీమిండియా వచ్చే శుక్రవారం నుంచి వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం భారత జట్టు వెస్టిండీస్ చేరుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగే తొలి వన్డే కోసం జట్టు ట్రినిడాడ్ చేరిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సీనియర్ క్రికెటర్లంతా ఈ సిరీస్కు…
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుక్రవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా తమ రాజ్యాంగంలోని కూలింగ్ ఆఫ్ పీరియడ్ను తొలగిస్తూ 2019 డిసెంబరులో చేసిన సవరణలను ఆమోదించాలంటూ 2019లో దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని తన పిటిషన్లో బీసీసీఐ పేర్కొంది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు అంగీకారం తెలపడంతో వచ్చేవారం విచారణ తెలపనుంది. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జై షా పదవీకాలం సెప్టెంబరుతో ముగియనుంది. Read Also: Telangana: తెలంగాణలో…
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. విదేశాలకు చెందిన ప్రముఖ ఆటగాళ్లు ఓ జట్టుగా, అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు మరో జట్టుగా మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇండియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య ఆగస్టు 22న మ్యాచ్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు వెల్లడించారు. Read Also:…
ఆగస్టులో శ్రీలంక వేదికగా ఆసియా కప్ 2022 టోర్నీ జరగనుంది. అయితే ఇదే సమయంలో జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా పర్యటించాల్సి ఉంది. ఒకే సమయంలో రెండు పర్యటనలు ఉండటంతో ఆసియా కప్కు రోహిత్ శర్మ సారథ్యంలోని సీనియర్ల జట్టును, జింబాబ్వేకు జూనియర్ల జట్టును పంపించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఆసియా కప్లో పాల్గొనే టీమ్కు రాహుల్ ద్రవిడ్ కోచ్గా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లే బీ టీమ్కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరించనున్నారు.…
ఒకప్పుడు రన్ మెషీన్గా ఓ వెలుగు వెలిగిన విరాట్ కోహ్లీ.. కొంతకాలం నుంచి ఆ స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. అవకాశాల మీద అవకాశాలు ఇస్తోన్నా.. వాటిని సద్వినియోగపరచుకోవడం లేదు. మూడేళ్ల నుంచి సెంచరీ కూడా చేయలేదు. రీసెంట్గా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్లోనూ ఫెయిలయ్యాడు. దీంతో కోహ్లీపై వేటు తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో కోహ్లి రాణించకపోతే.. అదే అతని ఆఖరి సిరీస్ అవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ…
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. తొలుత ఓ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ అనంతరం వన్డేలు, టీ20లలో కూడా ఇంగ్లండ్తో భారత జట్టు తలపడనుంది. ఈ మేరకు వన్డేలు, టీ20లకు భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి హార్డిక్ పాండ్యా పునరాగమనం చేశాడు. అటు గాయం నుంచి కోలుకున్న జడేజా కూడా వన్డేలకు అందుబాటులోకి రానున్నాడు. ఇటీవల పొట్టి క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న అర్ష్దీప్ సింగ్కు కూడా సెలక్టర్లు…
దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ తన సత్తా చాటుకుంది. ఈ ఏడాది జరిగిన రంజీ ట్రోఫీని మధ్యప్రదేశ్ జట్టు సొంతం చేసుకుంది. 2021-22 సీజన్ రంజీ ట్రోఫీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ జట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై జట్టుపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచి చరిత్రలో తొలిసారిగా రంజీ ట్రోఫీని దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్లో ముంబై జట్టు 269 పరుగులు చేయగా మధ్యప్రదేశ్ ముందు 108 పరుగుల స్వల్ప…
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి జట్లలో టీమిండియా ఒకటి. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. అటు వన్డే, ఇటు టీ20లలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్గానూ నిలిచింది. టెస్టుల్లోనూ అగ్రస్థానంలో కొన్నాళ్ల పాటు కొనసాగింది. అయితే 1983లో టీమిండియా పసికూన . ఆ ఏడాది జరిగి వన్డే ప్రపంచకప్లో అండర్ డాగ్గా బరిలోకి దిగింది. ఆనాడు టీమిండియాపై ఎలాంటి అంచనాలు లేవు. సెమీస్కు వెళ్తే అదే గొప్ప అనే అభిప్రాయంలో క్రికెట్ పండితులు ఉన్నారు. కానీ కపిల్ దేవ్…