BCCI: ప్రపంచకప్ కోసం 20 మంది ఆటగాళ్ల జాబితా.. మళ్లీ తెరపైకి యో-యో ఫిట్ నెస్ టెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022లో భారత్ పేలవ ప్రదర్శనను సమీక్షించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం ముంబైలో టీమిండియా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అక్టోబర్లో భారత్లో జరగనున్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 కోసం బీసీసీఐ 20 మంది ఆటగాళ్ల జాబితాను తయారుచేసింది. నవంబర్లో టోర్నీ సెమీఫైనల్లో ఇంగ్లండ్తో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.గత ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన ఆసియా కప్లో కూడా భారత్ పేలవ ప్రదర్శన కనబరిచింది. చివరి నాలుగు దశల్లో ఫైనల్కు చేరుకోవడంలో విఫలమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. డిసెంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్ను కూడా 2-1 తేడాతో కోల్పోయింది.
ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్సీఏ క్రికెట్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ పాల్గొన్నారు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023కి సంబంధించిన రోడ్మ్యాప్తో పాటు ఆటగాళ్ల లభ్యత, పనిభార నిర్వహణ, ఫిట్నెస్ ప్రమాణాలపైనా కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని 20 మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేశారు.సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. వాటిలో ఒకటి, వర్ధమాన ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపిక కావడానికి గణనీయమైన దేశీయ సీజన్ను ఆడవలసి ఉంటుంది.
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
Blink It: ‘బ్లింకిట్’కే మైండ్ బ్లాక్ అయ్యే ఆర్డర్ ఇచ్చిన బెంగుళూరు వాసి
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇటీవలకాలంలో తెరమరుగైన యో-యో ఫిట్ నెస్ టెస్టు, డెక్సా టెస్టు (ఎముకల సాంద్రతను పరిశీలించే స్కానింగ్ టెస్టు)లను సెలెక్షన్ ప్రక్రియలో తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు షా తెలిపారు. కోర్ ఆటగాళ్ల జాబితాకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన రోడ్ మ్యాప్ల అమలుకు సిఫారసులు వచ్చినట్టు వివరించారు. ఇక 2023లో ఐసీపీ వన్డే వరల్డ్ కప్, పలు ద్వైపాక్షిక సిరీస్ లు ఉన్నందున ఐపీఎల్లో ఆడే టీమిండియా ఆటగాళ్లపై పనిభారం పడని రీతిలో ఫ్రాంచైజీలతో జాతీయ క్రికెట్ అకాడమీ సమన్వయం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!