BCCI: ప్రపంచకప్ కోసం 20 మంది ఆటగాళ్ల జాబితా.. మళ్లీ తెరపైకి యో-యో ఫిట్ నెస్ టెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022లో భారత్ పేలవ ప్రదర్శనను సమీక్షించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం ముంబైలో టీమిండియా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అక్టోబర్లో భారత్లో జరగనున్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 కోసం బీసీసీఐ 20 మంది ఆటగాళ్ల జాబితాను తయారుచేసింది. నవంబర్లో టోర్నీ సెమీఫైనల్లో ఇంగ్లండ్తో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.గత ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన ఆసియా కప్లో కూడా భారత్ పేలవ ప్రదర్శన కనబరిచింది. చివరి నాలుగు దశల్లో ఫైనల్కు చేరుకోవడంలో విఫలమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. డిసెంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్ను కూడా 2-1 తేడాతో కోల్పోయింది.
ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్సీఏ క్రికెట్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ పాల్గొన్నారు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023కి సంబంధించిన రోడ్మ్యాప్తో పాటు ఆటగాళ్ల లభ్యత, పనిభార నిర్వహణ, ఫిట్నెస్ ప్రమాణాలపైనా కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని 20 మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేశారు.సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. వాటిలో ఒకటి, వర్ధమాన ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపిక కావడానికి గణనీయమైన దేశీయ సీజన్ను ఆడవలసి ఉంటుంది.
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
Blink It: ‘బ్లింకిట్’కే మైండ్ బ్లాక్ అయ్యే ఆర్డర్ ఇచ్చిన బెంగుళూరు వాసి
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇటీవలకాలంలో తెరమరుగైన యో-యో ఫిట్ నెస్ టెస్టు, డెక్సా టెస్టు (ఎముకల సాంద్రతను పరిశీలించే స్కానింగ్ టెస్టు)లను సెలెక్షన్ ప్రక్రియలో తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు షా తెలిపారు. కోర్ ఆటగాళ్ల జాబితాకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన రోడ్ మ్యాప్ల అమలుకు సిఫారసులు వచ్చినట్టు వివరించారు. ఇక 2023లో ఐసీపీ వన్డే వరల్డ్ కప్, పలు ద్వైపాక్షిక సిరీస్ లు ఉన్నందున ఐపీఎల్లో ఆడే టీమిండియా ఆటగాళ్లపై పనిభారం పడని రీతిలో ఫ్రాంచైజీలతో జాతీయ క్రికెట్ అకాడమీ సమన్వయం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్డాక్పై
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!