BCCI: ప్రపంచకప్ కోసం 20 మంది ఆటగాళ్ల జాబితా.. మళ్లీ తెరపైకి యో-యో ఫిట్ నెస్ టెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022లో భారత్ పేలవ ప్రదర్శనను సమీక్షించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం ముంబైలో టీమిండియా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అక్టోబర్లో భారత్లో జరగనున్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 కోసం బీసీసీఐ 20 మంది ఆటగాళ్ల జాబితాను తయారుచేసింది. నవంబర్లో టోర్నీ సెమీఫైనల్లో ఇంగ్లండ్తో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.గత ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన ఆసియా కప్లో కూడా భారత్ పేలవ ప్రదర్శన కనబరిచింది. చివరి నాలుగు దశల్లో ఫైనల్కు చేరుకోవడంలో విఫలమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. డిసెంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్ను కూడా 2-1 తేడాతో కోల్పోయింది.
ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్సీఏ క్రికెట్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ పాల్గొన్నారు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023కి సంబంధించిన రోడ్మ్యాప్తో పాటు ఆటగాళ్ల లభ్యత, పనిభార నిర్వహణ, ఫిట్నెస్ ప్రమాణాలపైనా కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని 20 మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేశారు.సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. వాటిలో ఒకటి, వర్ధమాన ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపిక కావడానికి గణనీయమైన దేశీయ సీజన్ను ఆడవలసి ఉంటుంది.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
Blink It: ‘బ్లింకిట్’కే మైండ్ బ్లాక్ అయ్యే ఆర్డర్ ఇచ్చిన బెంగుళూరు వాసి
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇటీవలకాలంలో తెరమరుగైన యో-యో ఫిట్ నెస్ టెస్టు, డెక్సా టెస్టు (ఎముకల సాంద్రతను పరిశీలించే స్కానింగ్ టెస్టు)లను సెలెక్షన్ ప్రక్రియలో తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు షా తెలిపారు. కోర్ ఆటగాళ్ల జాబితాకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన రోడ్ మ్యాప్ల అమలుకు సిఫారసులు వచ్చినట్టు వివరించారు. ఇక 2023లో ఐసీపీ వన్డే వరల్డ్ కప్, పలు ద్వైపాక్షిక సిరీస్ లు ఉన్నందున ఐపీఎల్లో ఆడే టీమిండియా ఆటగాళ్లపై పనిభారం పడని రీతిలో ఫ్రాంచైజీలతో జాతీయ క్రికెట్ అకాడమీ సమన్వయం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!