Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Today 22 12 22 Business Headlines From Telugu States To International

Today (22-12-22) Business Headlines: బీసీసీఐతో మరో సంస్థ కటీఫ్‌!. ఇలాంటి మరిన్ని ముఖ్య వార్తలు..

Published Date :December 22, 2022 , 11:29 am
By Akkirala Kondala Rao
Today (22-12-22) Business Headlines: బీసీసీఐతో మరో సంస్థ కటీఫ్‌!. ఇలాంటి మరిన్ని ముఖ్య వార్తలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Today (22-12-22) Business Headlines:

ఆజాద్‌ ఇంజనీరింగ్‌ స్పెషల్‌ యూనిట్‌: హైదరాబాద్‌కు చెందిన ఆజాద్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ.. జపాన్‌ సంస్థ మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ కోసం స్పెషల్‌ యూనిట్‌ని ఏర్పాటుచేస్తోంది. మేడ్చల్‌కి దగ్గరలోని తునికిబొల్లారం ప్రాంతంలో తలపెట్టిన ఈ యూనిట్‌ నిర్మాణానికి నిన్న బుధవారం భూమి పూజ చేశారు. సుమారు 165 కోట్ల రూపాయలు వెచ్చించి అందుబాటులోకి తేనున్న ఈ కేంద్రంలో స్టీమ్‌ లేదా గ్యాస్‌ ఎయిర్‌ ఫాయిల్స్‌ను తయారుచేసి మిత్సుబిషికి సప్లై చేస్తుంది. ఆజాద్‌ ఇంజనీరింగ్‌ సంస్థ ఇప్పటికే ఏరోస్పేస్‌, విద్యుదుత్పత్తి, సహజ వాయువు మరియు చమురు రంగాల్లోని కంపెనీలకు సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read

  • Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
  • Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
  • AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
  • Mamata Banerjee: "ఇక మనం జాగ్రత్తగా ఉండాలి".. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!

పీఎం మోడీతో ఎయిర్‌బస్‌ సీఈఓ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో యూరోపియన్‌ సంస్థ ఎయిర్‌బస్‌ సీఈఓ గ్విలౌమ్‌ ఫౌరీ నిన్న బుధవారం భేటీ అయ్యారు. తమ కంపెనీ కార్యకలాపాలను ఇండియాలో విస్తరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో పౌర విమానయాన వృద్ధికి తమ వంతు మద్దతు కొనసాగిస్తామని తెలిపారు. మోడీతో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఆయన మరిన్ని వివరాలను వెల్లడించలేదు. గ్విలౌమ్‌ ఫౌరీ ప్రస్తావించిన ‘‘ఇండియాలో తమ పారిశ్రామిక ఉనికి’’ అనే వ్యాఖ్యలను బట్టి చూస్తే.. మన దేశం సివిల్ సప్లై చైన్‌లో మరింతగా ఇన్వాల్వ్‌ కానుందనే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.

మెట్రో ఇండియా.. రూ.2,850 కోట్లు..

మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియాను రిలయెన్స్‌ రిటైల్‌ 2 వేల 850 కోట్ల రూపాయలకు అక్వైర్‌ చేసుకోనుంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించనుంది. మెట్రో ఇండియాలోని వంద శాతం వాటాలను సొంతం చేసుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై రిలయెన్స్‌ రిటైల్‌ సంతకాలు చేసింది. 2003లో మన దేశంలో కార్యకలాపాలను ప్రారంభించిన మెట్రో సంస్థ ఇప్పుడు 21 నగరాల్లో 31 లార్జ్‌ ఫార్మాట్‌ స్టోర్లను నిర్వహిస్తోంది. వాటిలో దాదాపు 3 వేల 500 మంది ఉద్యోగులు ఉన్నారు. మెట్రోలో పెద్ద సంఖ్యలో ఉన్న కిరాణా షాపులు, ఇతర సంస్థాగత వినియోగదారులు, సప్లయర్‌ నెట్‌వర్క్‌ పైన కూడా రిలయెన్స్‌ యాక్సెస్‌ పొందుతుంది.

ఇండియా స్టీల్‌పై.. నిషేధం ఎత్తివేత!.

ఇండియా నుంచి దిగుమతి చేసుకునే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని బ్రిటన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆ దేశ వర్తక సంఘం ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను ఆమోదించటం వల్ల స్థానిక పరిశ్రమలకు వచ్చే నష్టమేమీ లేదని అభిప్రాయపడింది. ప్రపోజల్‌కి సర్కారు అంగీకారం తెలిపితే మన దేశం నుంచి బ్రిటన్‌కి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కడ్డీలు, రాడ్‌ల ఎగుమతి మళ్లీ యథావిధిగా కొనసాగుతుంది. తమ ప్రొడక్టులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయకపోతే బ్రిటన్‌ నుంచి వచ్చే ఉత్పత్తుల పైన అదనంగా కస్టమ్స్‌ డ్యూటీస్‌ని విధించాల్సి ఉంటుందని ఇండియా ఈ ఏడాది ఆరంభంలో పేర్కొనటం తెలిసిందే.

బీసీసీఐతో మరో సంస్థ కటీఫ్‌!

ఎడ్‌టెక్‌ మేజర్‌ కంపెనీ బైజూస్‌ బాటలోనే ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ కూడా నడవనుంది. బీసీసీఐతో కుదుర్చుకున్న స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాల నుంచి వైదొలగనుంది. బైజూస్‌ ఇప్పటికే ఈ నిర్ణయానికొచ్చినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కి ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న ఈ రెండు సంస్థలు ఇలా బీసీసీఐకి గుడ్‌బై చెప్పనుండటం చర్చనీయాంశంగా మారింది. బైజూస్‌ ఈ ఏడాది జూన్‌లో జెర్సీ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని 2023 నవంబర్‌ వరకు పొడిగిస్తూ బీసీసీఐతో డీల్‌ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ 35 మిలియన్‌ డాలర్లు. అయితే.. కనీసం మార్చి వరకైనా కొనసాగాలంటూ బీసీసీఐ.. బైజూస్‌ని రిక్వెస్ట్‌ చేస్తోంది.

2023లో.. ఈవీ సేల్స్‌ కొత్త రికార్డు..

మన దేశంలో విద్యుత్‌ వాహనాల విక్రయాలు వచ్చే ఏడాది సరికొత్త రికార్డును నెలకొల్పే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. మార్కెట్లోకి కొత్త మోడళ్లు ప్రవేశించనున్న నేపథ్యంలో డిమాండ్‌ పెరగనుందని నిపుణులు భావిస్తున్నారు. 2023లో ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ సేల్స్‌ రెట్టింపు కన్నా ఎక్కువ కానున్నాయని, తద్వారా కనీసం లక్ష యూనిట్ల మార్క్‌ను చేరుకోనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈవీల చరిత్రలో ఈ స్థాయి అమ్మకాలు తొలిసారి నమోదుకానున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • airbus ceo
  • azad engineering
  • bcci
  • Byju's
  • daily business news

తాజావార్తలు

  • Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..

  • Abhishek-Travis Head: అభిషేక్‌ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..

  • Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!

  • Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..

  • AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions