IPL టీవీ, డిజిటల్ ప్రసారాలకి సంబంధించిన మీడియా హక్కుల్ని BCCI వేలంలో ఉంచింది. మొత్తం ఐదేళ్లకాలానికి ఉన్న ఈ రైట్స్ కనీస ధరని రూ.32 వేల కోట్లుగా BCCI నిర్ణయించింది. అయితే IPL మీడియా హక్కుల వేలం ఆదివారం ప్రారంభమైంది. IPL 2023 నుంచి 20 27 సీజన్ వరకూ మీడియా హక్కుల కనీస ధరని రూ.32,440 కోట్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఈ హక్కులు స్టార్ ఇండియా వద్ద ఉండగా.. 2017లో…
తొలి టీ20 మ్యాచ్లో ఓడిన భారత్ జట్టు.. ఈరోజు కటక్లో జరగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్లో పుంజుకోవాలని ఆశిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు రాత్రి జరగనున్న రెండో టీ20లో మొదట టాస్ గెలిచినా సఫారీలు ఫీల్డింగ్ ఎంచుకొని ,భారత్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందే వర్షం ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. గత గురువారం ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా టీమ్..…
మహిళల క్రికెట్ లో ఆమె ఒక సచిన్ టెండూల్కర్ . ఇప్పుడున్న ప్రతీ మహిళా క్రికెటర్ కూడా ఆమెను చూసే క్రికెటర్ అవ్వాలని అనుకున్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో ఆమెకు తిరుగు లేదు. ఆమె మరెవరో కాదు దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ . అయితే తాజాగా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆమె .. అవకాశం వస్తే కచ్చితంగా క్రికెట్ పాలకురాలిగా మారతానని మిథాలీ రాజ్ అంటోంది. మహిళల క్రికెట్ గురించి…
IPL మెగా టోర్నీకి సంబందించిన మీడియా హక్కుల వేలంలో BCCI కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బిడ్డర్లు వరుసగా తప్పుకుంటున్నారు. వేల కోట్లు కురుస్తాయని ధీమాగా ఉన్న బోర్డుకు ఈ వ్యవహారం మింగుడు పడటం లేదు. ఇప్పటికే అమెజాన్, గూగుల్ సాంకేతిక బిడ్లు సమర్పించలేదు. ఇప్పుడు జీ సైతం ప్యాకేజ్-ఏ నుంచి తప్పుకుందని సమాచారం. దాంతో డిస్నీ స్టార్, రిలయన్స్ వయాకామ్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మరికొన్ని రోజుల్లో సోనీ నెట్వర్క్లో…
భారత క్రికెట్ జట్టులో ఒక్కసారైనా ఆడాలని క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడే ప్రతీ ఒక్కరి కల. అయితే ఆ అదృష్టం అందరికి దక్కదు. చాలా తక్కువమందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. అయితే కేవలం రెండేళ్లలో తాను భారత జట్టుకు ఆడుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు IPL క్రికెటర్ అశ్విన్ హెబ్బార్. ఇందులో భాగంగానే త్వరలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ జరగబోతోంది. ప్రస్తుతం ఆ మ్యాచ్ లకు ప్రిపేర్ అవుతున్నానని చెబుతున్నాడు ఈ IPL క్రికెటర్. IPL…
వరుసగా 13 మ్యాచులు గెలిచి, ప్రపంచ రికార్డు విజయం సాధించాలనుకున్న టీమిండియా ఆశ నెరవేరలేదు. తొలి T20 ముందు వరకు కూడా 12 విజయాలతో పొట్టి ఫార్మాట్ లో అత్యధిక వరుస విజయాలు సాధించిన అఫ్గానిస్తాన్, రొమేనియాలతో కలిసి సమానంగా ఉన్న భారత్ జట్టుకు దక్షిణాఫ్రికా రూపంలో కళ్లెం పడింది. దాంతో వరుస విజయాల రికార్డును తన పేరిట లిఖించుకోలేకపోయింది. ఇక రేపు జరిగే రెండో T20 కోసం భారత జట్టు సిద్ధం అవుతోంది. ఒడిశా వేదికగా…
ఎంతో ఆసక్తి రేపిన ఐపీఎల్ 2022 సీజన్ దిగ్విజయంగా ముగిసింది. దీంతో తదుపరి సీజన్పై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో కొత్తగా ఈ ఏడాది రెండు జట్లు చేరడంతో పోటీతత్వం పెరిగి టోర్నీ మరింత రసవత్తరంగా సాగుతోంది. 2022 వరకు ఈ టోర్నీ బ్రాడ్కాస్టింగ్ హక్కులను స్టార్ ఇండియా కొనుగోలు చేసింది. అప్పట్లో సోనీ పిక్చర్స్ను బీట్ చేసిన స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్ల రూపాయలకు బ్రాడ్కాస్టింగ్ హక్కులు దక్కించుకుంది. ఈ డీల్తో…
టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్ను జూన్ 1న ఆగ్రాలో కుటుంబ సభ్యుల సమక్షంలో దీపక్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జయ భరద్వాజ్కు చాహర్ ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా సంతోషంగా అంగీకరించడంతో.. ఏడాది పాటు ఈ జంట ప్రేమ మత్తులో మునిగి తేలింది. గాయంతో దీపక్ చాహర్ క్రికెట్ కెరీర్కు బ్రేక్ రావడంతో వివాహం చేసుకున్నారు. ఆగ్రాలో…
సుమారు రెండున్నర నెలలపాటు అలరించిన IPL 2022 సీజన్ దిగ్విజయంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి అప్కమింగ్ భారత్-సౌతాఫ్రికా T20 సిరీస్పై నెలకొంది. సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకున్న వేళ ఐపీఎల్లో మెరిసిన స్టార్లతో టీమిండియా సొంతగడ్డపై సఫారీలతో అమీతుమీ తేల్చుకోనుంది. 5 T20ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య జూన్ 9న ఢిల్లీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న T20 ప్రపంచకప్కు ఈ సిరీస్ను టీమిండియా…
ఏపీలో త్వరలో మరో క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ-20 టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోగో, టీజర్ను సీఎం జగన్ ఆవిష్కరించారు. సీఎం నివాసంలో సీఎం జగన్ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 6 నుంచి జూలై 17 వరకు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టోర్నమెంట్ జరగనుంది.…