IND vs AUS: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. చీలమండకు గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరమైన మహ్మద్ షమీ రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం మధ్యప్రదేశ్తో జరిగే తమ తదుపరి రౌండ్ రంజీ మ్యాచ్లో షమీ బెంగాల్ తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మొత్తం 15 మ్యాచ్లు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పీసీబీ షెడ్యూల్ను సిద్ధం చేసి ఐసీసీకి పంపగా.. బీసీసీఐ కారణంగా డేట్స్ ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం… పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపైనే…
ఇటీవలి కాలంలో సొంతగడ్డపై భారత్ రెండు టెస్టు సిరీస్లను ఆడింది. బంగ్లాదేశ్తో రెండు టెస్టులను, న్యూజిలాండ్తో మూడు టెస్టులను ఆడింది. బంగ్లాదేశ్పై 2-0 తేడాతో సిరీస్ గెలిచిన టీమిండియా.. న్యూజిలాండ్పై మాత్రం ఘోర పరాజయంను చవిచూసింది. ఈ ఐదు టెస్టులు జరిగిన పిచ్ రిపోర్ట్లను తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. ఇందులో ఒక్క పిచ్కు మాత్రమే మంచి రేటింగ్ వచ్చిందట. మిగతా నాలుగు పిచ్లు మాత్రం పాస్ అయినట్లు తెలుస్తోంది. Also Read: Venu…
న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను భారత్ కోల్పోయిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై సిరీస్ కోల్పోవడమే కాకుండా.. వైట్ వాష్ ఇవ్వడంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కివీస్ టెస్ట్ సిరీస్ ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్లను వారం ముందుగానే కంగారో గడ్డపైకి పంపనుంది. న్యూజిలాండ్ సిరీస్లోని…
Team India: న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సొంతగడ్డపై.. అదీ స్పిన్ పిచ్లపై టీమిండియా పూర్తిగా విఫలమవడం వల్ల కొంతమంది సీనియర్లకు సెగ తగిలేలా కనబడుతుంది.
CSK- IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ రిటెన్షన్ అనుకున్నట్లుగానే కొనసాగింది. ‘కెప్టెన్ కూల్’ఎంఎస్ ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గానే సీఎస్కే తీసుకుంది. కేవలం 4 కోట్ల రూపాయలకే ధోనీకి చెల్లించనుంది.
అక్టోబరు 31న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనకు 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఎ జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ను ఇండియా ఎ జట్టుకు కెప్టెన్గా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. గత కొన్ని నెలలుగా భారత జట్టుకు ఎంపిక కాని యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు భారత్-ఎ జట్టులో చోటు దక్కింది. ఆంధ్ర యువ క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి,…
Champions Trophy 2025 Update: వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఐసీసీకి పీసీబీ పంపిన షెడ్యూల్ ప్రకారం.. టోర్నీ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 19న, ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. లాహోర్, రావల్పిండి, కరాచీలను వేదికలుగా ఎంపిక చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్కు టీమిండియా వెళ్లేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.…
Harmanpreet Kaur Captain For New Zealand ODI Series: న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ గురువారం 16 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ లీగ్ దశ నుంచే నిష్క్రమించినా.. సెలక్టర్లు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై నమ్మకం ఉంచారు. కివీస్ వన్డే సిరీస్కు ఆమెకే బాధ్యతలను అప్పగించారు. స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది. ఇక భారత జట్టులో నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు…
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్లలో రెండు మాత్రమే గెలిచి.. ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ చేసినా.. ఆమె నిదానంగా ఆడటం వల్లే ఓటమి ఎదురైందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. భారత్ లీగ్ దశ నుంచే నిష్క్రమించడంతో.. ఇప్పుడు ఆమె కెప్టెన్సీకే ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్లపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. ‘టీ20…