IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై ఇండియన్స్కు భారీ ప్రయోజనం!
- నవంబర్ నెలలో మెగా వేలం
- ఫ్రాంచైజీల డిమాండ్కే బీసీసీఐ మొగ్గు
- ముంబైకి భారీ ప్రయోజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Shama is in the Mumbai Indians for IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మెగా వేలం వచ్చిన ప్రతిసారీ అన్ని జట్లలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. మెగా వేలం సమయంలో నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఐపీఎల్ జట్లకు ఉంటుంది. దాంతో ప్రాంఛైజీలు కీలక ఆటగాళ్లను కోల్పోవడంతో జట్టు స్వరూపం పూర్తిగా మారిపోతుంటుంది. అయితే ఈసారి ఒకరిని అదనంగా అట్టిపెట్టుకునే అవకాశాన్ని ప్రాంఛైజీలకు బీసీసీఐ కల్పించబోతోందని తెలుస్తోంది.
అట్టిపెట్టుకునే ఆటగాళ్ల సంఖ్యను అయిదుకు పెంచాలని ఫ్రాంఛైజీలు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాంఛైజీలు, బీసీసీఐ మధ్య జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. కొన్ని కారణాల వల్ల ప్రాంచైజీల డిమాండ్ను బీసీసీఐ అంగీకరించలేదు. అయితే చివరకు ప్రాంచైజీల డిమాండ్కు బీసీసీఐ ఓకే అన్నట్లు సమాచారం. ప్రతీ ప్రాంచైజీకి ఐదుగురు ఆటగాళ్ల రిటెన్షన్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎమ్) కార్డ్ ఈసారి లేదని సమాచారం. ఐపీఎల్ 2025లో ఐదుగురు ఆటగాళ్లను ప్రతీ టీమ్ అట్టిపెట్టుకోవచ్చు. ఇది ముంబై ఇండియన్స్ లాంటి జట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
Also Read: IND vs BAN: అభిమానులు ఎగిరి గంతేస్తే.. కాన్పూర్ స్టేడియం పరిస్థితి ఏంటి?
కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ సారథి రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్లను ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకునే అవకాశముంది. ఇక తిలక్ వర్మ, ఇషాన్ కిషన్లలో ఒకరిని ఆర్టీఎమ్ ద్వారా తీసుకుంటుంది. రోహిత్ను కెప్టెన్గా తప్పించిన నేపథ్యంలో హిట్మ్యాన్ వేలంలోకి వెళ్తాడనే ప్రచారం జరిగింది. ముంబై కూడా రోహిత్ను వదులుకుంటుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు ముంబై యాజమాన్యం, రోహిత్ మధ్య మంచి సంబంధాలు ఉన్న కారణంగా.. హిట్మ్యాన్ జట్టుతో కొనసాగేందుకు సుముఖంగా ఉన్నాడని తెలుస్తోంది. రోహిత్తో ముంబై యాజమాన్యం సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హిట్మ్యాన్ ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!