Janasena MLA Arava Sridhar Case: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం.. వెలుగులోకి కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena MLA Arava Sridhar Case: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక ఆరోపణలపై పార్టీ అంతర్గత కమిటీ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తోంది అన్నారు త్రీ మెన్ కమిటీ సభ్యుడు శివశంకర్. ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు రైల్వే కోడూరులో 50 మందికి పైగా వ్యక్తులను ఇప్పటికే విచారించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. బాధితురాలు వీణను కమిటీ ముందు హాజరుకావాలని పిలిచినప్పటికీ ఆమె హాజరు కాలేదని.. అయితే, షీల్డ్ కవర్లో పూర్తి వివరాలు పంపించిందని అన్నారు. ఆ నివేదికను కమిటీ పరిశీలనలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Read Also: BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..
Also Read
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
ఇది జనసేన పార్టీకి సంబంధించిన అంశం కాదని.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, బాధితురాలు వీణ మధ్య ప్రైవేట్ వ్యవహారమని అన్నారు శివశంకర్. ఈ విషయాన్ని పార్టీకి రుద్దే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. రైల్వే కోడూరు పర్యటనలో అనేక కొత్త పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పారు తప్ప… కమిటీ నివేదికను వారం రోజుల్లో ఇవ్వాలని ఎవరూ చెప్పలేదని అన్నారు.. ఇది అత్యంత సున్నితమైన విషయం కాబట్టి లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశాన్ని వైసీపీ రాజకీయం చేస్తుంది అని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక వైసీపీ హస్తం ఉందేమో అనే కోణంలో కూడా విచారణ జరుగుతోందని తెలిపారు. వైసీపీది కన్స్ట్రక్టివ్ మైండ్ కాదు అని డిస్ట్రక్టివ్ మైండ్ అన్ని మండిపడ్డారు.. ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ వైఖరిలో మార్పు రాలేదని అన్నారు. ఇది జనసేన పార్టీ అంతర్గత కమిటీ విచారణ అని.. కమిటీ ఎలా పనిచేయాలి, ఎప్పుడు నివేదిక ఇవ్వాలి అన్నది వైసీపీకి సంబంధం లేని విషయమని స్పష్టం చేశారు. విచారణ వేగంగా కొనసాగుతోందని.. ఇంకా పలు కోణాల్లో దర్యాప్తు అవసరం ఉందని పేర్కొన్నారు.. త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు సమర్పిస్తామని తెలిపారు శివశంకర్..
తాజావార్తలు
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!