Janasena MLA Arava Sridhar Case: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం.. వెలుగులోకి కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena MLA Arava Sridhar Case: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక ఆరోపణలపై పార్టీ అంతర్గత కమిటీ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తోంది అన్నారు త్రీ మెన్ కమిటీ సభ్యుడు శివశంకర్. ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు రైల్వే కోడూరులో 50 మందికి పైగా వ్యక్తులను ఇప్పటికే విచారించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. బాధితురాలు వీణను కమిటీ ముందు హాజరుకావాలని పిలిచినప్పటికీ ఆమె హాజరు కాలేదని.. అయితే, షీల్డ్ కవర్లో పూర్తి వివరాలు పంపించిందని అన్నారు. ఆ నివేదికను కమిటీ పరిశీలనలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Read Also: BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..
Also Read
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
ఇది జనసేన పార్టీకి సంబంధించిన అంశం కాదని.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, బాధితురాలు వీణ మధ్య ప్రైవేట్ వ్యవహారమని అన్నారు శివశంకర్. ఈ విషయాన్ని పార్టీకి రుద్దే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. రైల్వే కోడూరు పర్యటనలో అనేక కొత్త పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పారు తప్ప… కమిటీ నివేదికను వారం రోజుల్లో ఇవ్వాలని ఎవరూ చెప్పలేదని అన్నారు.. ఇది అత్యంత సున్నితమైన విషయం కాబట్టి లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశాన్ని వైసీపీ రాజకీయం చేస్తుంది అని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక వైసీపీ హస్తం ఉందేమో అనే కోణంలో కూడా విచారణ జరుగుతోందని తెలిపారు. వైసీపీది కన్స్ట్రక్టివ్ మైండ్ కాదు అని డిస్ట్రక్టివ్ మైండ్ అన్ని మండిపడ్డారు.. ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ వైఖరిలో మార్పు రాలేదని అన్నారు. ఇది జనసేన పార్టీ అంతర్గత కమిటీ విచారణ అని.. కమిటీ ఎలా పనిచేయాలి, ఎప్పుడు నివేదిక ఇవ్వాలి అన్నది వైసీపీకి సంబంధం లేని విషయమని స్పష్టం చేశారు. విచారణ వేగంగా కొనసాగుతోందని.. ఇంకా పలు కోణాల్లో దర్యాప్తు అవసరం ఉందని పేర్కొన్నారు.. త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు సమర్పిస్తామని తెలిపారు శివశంకర్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!