Sheikh Hasina: బంగ్లాదేశ్ బూటకపు ఎన్నికలు రద్దు చేయాలి..
- బంగ్లాదేశ్ బూటకపు ఎన్నికల్ని నిషేధించాలి..
- హంతక యూనస్ ప్లాన్ చేసిన ఎన్నికలు..
- సంచలన విమర్శలు చేసిన షేక్ హసీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: హంతకుడు, ఫాసిస్ట్ మహ్మద్ యూనస్ నిర్వహించి బంగ్లాదేశ్ బూటకపు ఎన్నికల్ని రద్దు చేయాలని మాజీ ప్రధాని షేక్ హసీనా డిమాండ్ చేశారు. యూనస్ వెంటనే రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన 18 నెలల తర్వాత బంగ్లాలో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 12న జరిగాయి.
ఎన్నికలపై తన స్పందన తెలియజేస్తూ.. “ఈ ఓటర్లు లేని, చట్టవిరుద్ధమైన మరియు రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికలను రద్దు చేయాలని, యూనస్ రాజీనామా చేయాలని; తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని, రాజకీయ ఖైదీలతో పాటు ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, మేధావులు, నిపుణులను విడుదల చేయాలని, అవామీ లీగ్ కార్యకలాపాలపై విధించిన సస్పెన్షన్ను తొలగించాలని, తటస్థ కేర్టేకర్ ప్రభుత్వంలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, అందరినీ కలుపుకొని ఎన్నికలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల ఓటు హక్కులను పునరుద్ధరించాలని’’ ఆమె డిమాండ్ చేశారు.
Also Read
- Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
- India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
- Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
- US-Iran Peace Deal: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ టీమ్లో చీలిక.. CIA హెచ్చరికలతో ఉద్రిక్తత
Read Also: BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..
ఎన్నికలు యూనస్ నిర్వహించిన ఒక మోసపూరిత కార్యక్రమంగా ఆమె అభివర్ణించారు. చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా యూనస్ నిర్వహించి ఎన్నికలు జాగ్రత్తగా ప్లాన్ చేసిన ప్రహసనం అని ఆమె ఆరోపించారు. ప్రజల ఓటింగ్ హక్కుల్ని, ప్రజాస్వామ్య విలువను, రాజ్యాంగ స్పూర్తిని విస్మరించారని, అవామీ లీగ్, ఓటర్లు లేకుండా ఎన్నికల్ని నిర్వహించారని అన్నారు. ఫిబ్రవరి 11 సాయంత్రం నుంచే అక్రమాలు ప్రారంభమయ్యాయని, పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకోవడం, కాల్పులు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు.
ఓటింగ్ రోజు దేశవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఢాకాతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పూర్తిగా ఓటర్లు లేరని ఆమె అన్నారు. 11 గంటలకు ఓటింగ్ శాతం 14.96గా ఉందని, ఓటింగ్ ఎక్కువగా ఉండే సమయంలోనే ఇంత తక్కువ ఓటింగ్ ఉందని, అవామీ లీగ్ లేకుండా జరుగుతున్న ఎన్నికల్ని ప్రజలు తిరస్కరించడానికి ఇదే రుజువు అని చెప్పారు. అవామీ లీగ్ ఓటర్లు, మద్దతుదారుల్ని, మైనారిటీలను బలవంతంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు దాడులు, అరెస్టులు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?