Sheikh Hasina: బంగ్లాదేశ్ బూటకపు ఎన్నికలు రద్దు చేయాలి..
- బంగ్లాదేశ్ బూటకపు ఎన్నికల్ని నిషేధించాలి..
- హంతక యూనస్ ప్లాన్ చేసిన ఎన్నికలు..
- సంచలన విమర్శలు చేసిన షేక్ హసీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: హంతకుడు, ఫాసిస్ట్ మహ్మద్ యూనస్ నిర్వహించి బంగ్లాదేశ్ బూటకపు ఎన్నికల్ని రద్దు చేయాలని మాజీ ప్రధాని షేక్ హసీనా డిమాండ్ చేశారు. యూనస్ వెంటనే రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన 18 నెలల తర్వాత బంగ్లాలో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 12న జరిగాయి.
ఎన్నికలపై తన స్పందన తెలియజేస్తూ.. “ఈ ఓటర్లు లేని, చట్టవిరుద్ధమైన మరియు రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికలను రద్దు చేయాలని, యూనస్ రాజీనామా చేయాలని; తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని, రాజకీయ ఖైదీలతో పాటు ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, మేధావులు, నిపుణులను విడుదల చేయాలని, అవామీ లీగ్ కార్యకలాపాలపై విధించిన సస్పెన్షన్ను తొలగించాలని, తటస్థ కేర్టేకర్ ప్రభుత్వంలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, అందరినీ కలుపుకొని ఎన్నికలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల ఓటు హక్కులను పునరుద్ధరించాలని’’ ఆమె డిమాండ్ చేశారు.
Also Read
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
- Iran Hit List: ఇరాన్ హిట్లిస్ట్లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
- Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
- US Iran Conflict: ఇరాన్పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్లలో పేలుళ్లు.. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు
Read Also: BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..
ఎన్నికలు యూనస్ నిర్వహించిన ఒక మోసపూరిత కార్యక్రమంగా ఆమె అభివర్ణించారు. చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా యూనస్ నిర్వహించి ఎన్నికలు జాగ్రత్తగా ప్లాన్ చేసిన ప్రహసనం అని ఆమె ఆరోపించారు. ప్రజల ఓటింగ్ హక్కుల్ని, ప్రజాస్వామ్య విలువను, రాజ్యాంగ స్పూర్తిని విస్మరించారని, అవామీ లీగ్, ఓటర్లు లేకుండా ఎన్నికల్ని నిర్వహించారని అన్నారు. ఫిబ్రవరి 11 సాయంత్రం నుంచే అక్రమాలు ప్రారంభమయ్యాయని, పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకోవడం, కాల్పులు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు.
ఓటింగ్ రోజు దేశవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఢాకాతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పూర్తిగా ఓటర్లు లేరని ఆమె అన్నారు. 11 గంటలకు ఓటింగ్ శాతం 14.96గా ఉందని, ఓటింగ్ ఎక్కువగా ఉండే సమయంలోనే ఇంత తక్కువ ఓటింగ్ ఉందని, అవామీ లీగ్ లేకుండా జరుగుతున్న ఎన్నికల్ని ప్రజలు తిరస్కరించడానికి ఇదే రుజువు అని చెప్పారు. అవామీ లీగ్ ఓటర్లు, మద్దతుదారుల్ని, మైనారిటీలను బలవంతంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు దాడులు, అరెస్టులు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
-
India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!