Rohingya Refugees: నెల రోజులు నడి సముద్రంలోనే.. చివరికి గాలులతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohingya Refugees Boat Reached Indonesia After A Month: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నెల రోజుల పాటు రోహింగ్యా శరణార్థులు సముద్రంలో చిక్కుకుపోయారు. పొట్ట చేత పట్టుకొని పొరుగు దేశాలకు వలస వెళ్లిన ఈ రొహింగ్యాలు.. సముద్ర మార్గం ద్వారా తమ ప్రయాణాన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే.. మధ్యలోనే ఇంజిన్ పని చేయకపోవడంతో, నడి సముద్రంలో వాళ్లు చిక్కుకున్నారు. ఇంజిన్ని తిరిగి స్టార్ట్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పోనీ.. అటుగా ఏవైనా పడవలొచ్చి తమని రక్షిస్తాయనుకుంటే, అదీ లేదు. చుట్టూ సముద్రపు నీరే. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేవు. ఇక తమని ఆ దేవుడే కాపాడాలంటూ.. ఆ పడవలో నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. చివరికి గాలుల పుణ్యమా అని.. ఆ పడవ అటూఇటూ కొట్టుకుపోతూ ఇండోనేషియా తీరానికి చేరుకుంది.
Anuraj Thakur: ఇంకా 1962లోనే ఉన్నారంటూ.. రాహుల్పై అనురాగ్ కౌంటర్
Also Read
- Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
- Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
- America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
మొత్తం 57 మంది రొహింగ్యాలతో కూడిన ఆ పడవ.. ఇండోనేషియాలోని అషే బేసర్ తీరానికి చేరుకుంది. ఇంజిన్ పాడవ్వడంతో.. నెల రోజుల పాటు తాము అండమాన్ సముద్రంలోనే తిండి, నీరు లేక కొట్టుమిట్టాడామని ఆ రోహింగ్యాలు చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ శరణార్థులను ప్రభుత్వ ఆవాసంలో తాత్కాలికంగా స్థావరం కల్పించామని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారు తెలిపారు. సుదీర్ఘ ప్రయాణం చేయడంతో పాటు.. నెల రోజుల పాటు సముద్రంలో చిక్కుకుపోవడంతో వాళ్లు ఆహారం లేక బలహీనంగా మారారని, డీహైడ్రేషన్ బారిన పడ్డారని చెప్పారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే.. ఈ రొహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారన్న విషయం ఇంకా తేలాల్సి ఉందన్నారు. సోమవారం సాయంత్రం కూడా 186 మంది రొహింగ్యాలతో కూడిన మరొక పడవ కూడా అసెహ్ తీరానికి వచ్చి చేరింది. వారికి కూడా ఎమర్జెన్సీ సేవలు అందించినట్టు ఆ అధికారి వెల్లడించారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
కాగా.. వాస్తవానికి ఈ రొహింగ్యాలందరూ మయన్మార్లో నివసిస్తుంటారు. అయితే.. అక్కడ సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాది రొహింగ్యాలు 2017లో తరలిపోయారు. అక్కడ కూడా పరిస్థితులు క్షీణించడంతో.. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వలసబాట పట్టారు. ఈ క్రమంలోనే సముద్ర మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
-
Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!