విశాఖ సముద్ర తీరంలోని తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకుని వచ్చిన బంగ్లాదేశ్ వాణిజ్య నౌక ఎం. వీ.మాను మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.ఈ నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మార్చాలని నిర్ణయించారు. దీంతో పనులు జరుగుతున్న తీరును మంత్రి అవంతి పరిశీలించారు. పీపీపీ పద్ధతిలో గిల్మైరైన్ కంపెనీతో కలిసి ఈ షిప్ను రెస్టారెంట్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎం.వీమా ను డిసెంబర్ 29 నాటికి పర్యాటక ప్రదేశంగా తయారు చేస్తామని…
సొంతగడ్డపై పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ అంచనాలకు మించి రాణిస్తోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ను పాకిస్థాన్ బౌలర్లు దెబ్బతీశారు. ఓపెనర్లు ఇస్లాం (14), సైఫ్ హసన్ (14) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. అనంతరం శాంతో (14), కెప్టెన్ మోనిముల్ హక్ (6) కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో 49 పరుగులకే బంగ్లాదేశ్…
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మహ్మదుల్లా టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది ప్రారంభంలో జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్తో తిరిగి జట్టులోకి పునరాగమనం చేసిన అతడు.. ఎక్కువకాలం టెస్టుల్లో కొనసాగేందుకు సిద్ధంగా లేనని ఆ సమయంలోనే బోర్డుకు సూచించాడు. దీంతో పాకిస్థాన్తో టెస్టు సిరీస్కు ముందు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం నుంచి బంగ్లాదేశ్-పాకిస్థాన్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు క్రికెట్లో 50 టెస్టులు ఆడిన మహ్మదుల్లా 33.11…
UN-మద్దతుగల COVAX గ్లోబల్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కింద 50 లక్షల డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ను నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్ లకు ఎగుమతి చేయడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ మూడు దేశాలతో పాటు, SII COVAX కింద కోవిషీల్డ్ను బంగ్లాదేశ్కు కూడా ఎగుమతి చేయనున్నట్టు వారు తెలిపారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) నవంబర్ 23 నుంచి COVAX ప్రోగ్రామ్ కింద కోవిడ్…
ఇండియలో అది అత్యంత అరుదైన ఇల్లు. అలాంటి ఇంటిని దేశంలో మరెక్కడా చూసి ఉండరు. ఆ ఇంటి చుట్టూ రెండు దేశాల సైనికులు పహారా కాస్తుంటారు. ఇది అధికారుల అధికారిక నివాసం కాదు. సామాన్యులు నివసించే ఇల్లే. కానీ, ఈ ఇంటికి చాలా చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. తూర్పుపాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత ఇండియా.. బంగ్లాదేశ్ మధ్య ఖచ్చితమైన సరిహద్దు ఉన్నది. వేల కిలోమీటర్లమేర సరిహద్దు ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో…
టీ20 ప్రపంచకప్లో గ్రూప్-1లో భాగంగా షార్జాలో జరిగిన బంగ్లాదేశ్-వెస్టిండీస్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరకు వెస్టిండీస్ జట్టునే విజయం వరించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది. వెస్టిండీస్ టాపార్డర్ లూయిస్ (6), క్రిస్ గేల్ (4), హెట్మెయిర్ (9), ఆండ్రీ రస్సెల్ (0) విఫలమయ్యారు. బ్యాటింగ్ చేస్తూ మధ్యలో మైదానాన్ని వీడిన కెప్టెన్ పొలార్డ్…
టీ20 ప్రపంచకప్లో గ్రూప్-1లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 124/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాట్స్మెన్లో ముష్ఫీకర్ రహీమ్ (29), మహ్మదుల్లా (19), నసమ్ అహ్మద్ (19), నూరుల్ హసన్ (16), మెహిదీ హసన్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టైమల్ మిల్స్ 3 వికెట్లు,…
టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో షకీబుల్ హసన్ రెండు వికెట్లు సాధించాడు. ఒకే ఓవర్లో నిశాంక, అవిష్క ఫెర్నాండో వికెట్లను షకీబ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అతడు రికార్డులకెక్కాడు. శ్రీలంక జరుగుతున్న మ్యాచ్లో తీసిన రెండు వికెట్లతో కలిపి ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో షకీబ్ 41 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 ప్రపంచకప్లో…
టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ముందడుగు వేసింది. ఎట్టకేలకు గ్రూప్ స్టేజీ నుంచి సూపర్ 12లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో పసికూన పపువా న్యూగునియాపై 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సూపర్ 12లోకి వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు సత్తా చాటారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మహ్మద్ నయీమ్ డకౌట్ అయినా షకీబ్ (46), లిటన్ దాస్ (29), కెప్టెన్ మహ్మదుల్లా (50) చెలరేగి…
బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామిపక్కదేశమైన బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఖండించడం లేదని రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. చైనా లద్దాక్ను ఆక్రమించడానికి వచ్చినప్పుడు దూకుడు ప్రదర్శించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తుందో చెప్పాలన్నారు.ఆప్ఘన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్నారన్నారు. బంగ్లా మరో ఆప్ఘాన్ కాకముందే భారత ప్రభుత్వం స్పందించి బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువుల హక్కులను కాపాడాలన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్వంత పార్టీ…