బంగ్లాదేశ్లో సిత్రాంగ్ తుఫాన్ విళయతాండవం చేస్తోంది. సోమవారం రాత్రి బంగ్లాదేశ్లోని బరిసాల్ సమీపంలోని టింకోనా ద్వీపం, శాండ్విప్ మధ్య సిత్రాంగ్ తీరాన్ని దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటుకుని బంగ్లాదేశ్ తీరాన్ని దాటింది. సిత్రాంగ్ తుఫాన్ కారణంగా దాదాపు 35 మంది చనిపోయారు.
Cyclone Sitrang : తుఫాను 'సిత్రాంగ్' బలపడి బంగ్లాదేశ్ వైపు కదులుతున్నందున పశ్చిమ బెంగాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
A thief called the police fearing a mob attack in Bangladesh: బంగ్లాదేశ్ లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ దొంగ పోలీసులకే ఫోన్ చేసి షాకిచ్చాడు. తనను రక్షించాలని పోలీసులను వేడుకున్నాడు. దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో స్థానిక గుంపుకు చిక్కుతాననే భయంతో తనను కాపాడాలని కోరాడు. కోపంతో ఉన్న గుంపు తనను కొట్టి చంపేస్తాడని భావించిన దొంగ పోలీసుల హెల్ప్ కోరాడు. బంగ్లాదేశ్ దక్షిణ బారిసల్ నగరంలో మూసి ఉన్న…
Attack on Hindu Temple in bangladesh: బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ మతఛాందసవాదులు తరుచుగా హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ప్రధాని షేక్ హసీనా మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉంటామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరేలా ఉంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లో అత్యంత పురాతనమైన హిందూ ఆలయంపై దాడి చేశారు దుండగులు. దేవీ దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.
Gold seizure in Delhi: ఢిల్లీలో భారీగా బంగారం పట్టుబడింది. ఈశాన్య ఢిల్లీలో డీఆర్ఐ అధికారులు రూ.33.40 కోట్ల విలువ చేసే 65.46 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఐజ్వాల్ నుంచి ముంబాయి వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లో బంగారాన్ని గుర్తించిన పాట్నా, ఢిల్లీ, ముంబాయి డీఆర్ఐ స్పెషల్ టీములు గుర్తించాయి. గోనే సంచుల్లో బంగారం తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు పక్కా ప్లాన్ తో గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేశారు.
Bangladesh: బంగ్లాదేశ్ లో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలింది. మంగళవారంనాడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మందికి కరెంట్ లేకుండా పోయింది.
బంగ్లాదేశ్లోని పంచగఢ్ జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. పడవ బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రయాణికులు నదిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.