Russia: బంగ్లా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం.. రాయబారి పర్యటనపై రష్యా మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నాయకుడి కుటుంబాన్ని కలవడానికి అమెరికా రాయబారి షాహీన్బాగ్ను సందర్శించడం బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే ప్రయత్నమని రష్యా పేర్కొంది. బంగ్లాదేశ్లోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. అమెరికా రాయబారి దేశీయ అంతర్గత వ్యవహారాలను ప్రభావితం చేసేందుకు పట్టుదలతో ప్రయత్నిస్తున్నారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖారోవా విలేఖరుల సమావేశంలో తెలిపారు.
అమెరికా రాయబారి బంగ్లా హక్కుల గురించి పట్టించుకునే సాకుతో అక్కడ దాక్కున్నారని జఖారోవా వెల్లడించారు. గతంలో డిసెంబర్ 14న అమెరికా రాయబారి పీటర్ హాస్ సుమారు దశాబ్దం క్రితం అదృశ్యమైన బీఎన్పీ నాయకుడు సజేదుల్ ఇస్లాం నివాసాన్ని సందర్శించారు. ఆయన నివాసం నుంచి బయటకు రాగానే కొందరు వ్యక్తులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆయన తన భద్రతా సిబ్బంది సాయంతో అక్కడి నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. అనంతరం అమెరికా రాయబార్ పీటర్ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్తో అత్యవసర సమావేశం నిర్వహించి తన పర్యటన వివరాలు ఎలా లీక్ అయ్యాయని ప్రశ్నించారు.
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ఢాకాలోని యూఎస్ రాయబారి పీటర్ హాస్కు సంబంధించిన సంఘటనకు సంబంధించిన ఆందోళన గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వ అత్యున్నత స్థాయికి అమెరికా తెలియజేసింది. ఈ విషయం వాషింగ్టన్లో కూడా చర్చనీయాంశమైంది. డిసెంబర్ 15న యూఎస్లోని బంగ్లాదేశ్ రాయబారి మొహమ్మద్ ఇమ్రాన్తో చర్చల సందర్భంగా, యూఎస్ సెంట్రల్, దక్షిణాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ అమెరికా రాయబారి పీటర్ డీ హాస్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
Taiwan: చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు.. తైవాన్ సంచలన నిర్ణయం
ఇదే సంఘటనను ప్రస్తావిస్తూ యూఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండి షెర్మాన్ గురువారంబంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి షహరియార్ ఆలమ్ను పిలిచి, ఎన్నికలు, భద్రత, యూఎస్ ఎంబసీ సిబ్బంది భద్రత గురించి చర్చించారు.”బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి షహరియార్ ఆలమ్తో చర్చ జరిగింది. యూఎస్-బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేయడం, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికల ప్రాముఖ్యత, యూఎస్ ఎంబసీ సిబ్బంది భద్రతపై చర్చించాం” అని షెర్మాన్ ట్వీట్ చేశారు. అంతకుముందు, డిసెంబర్ 19 న ఢాకాలో ఉన్న విదేశీ దౌత్యవేత్తల భద్రత విషయానికి వస్తే ఆందోళన చెందాల్సిన పని లేదని మోమెన్ అన్నారు. దౌత్యవేత్తలందరికీ పూర్తి రక్షణ కల్పిస్తామని బంగ్లా ప్రభుత్వం హామీ ఇస్తుందన్నారు.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!