India vs Bangladesh: టాస్గెలిచిన బంగ్లా.. టీమిండియా తుది జట్టు ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీర్పూర్ వేదికగా… భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం అయ్యింది.. తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా… రెండో టెస్టులోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. తొలి టెస్టులో టీమిండియా అన్ని రంగాల్లో సమష్టిగా రాణించింది. ఓపెనర్లు, మిడిలార్డర్తో పాటు టెయిలెండర్లు అద్భుతంగా రాణించారు. చతేశ్వర్ పూజారా, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భారీ స్కోరుకి పునాదులు వేశారు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్…అసాధారణ బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ ఒక్కటే కాదు.. బౌలింగ్లోనూ టీమిండియా పటిష్టంగా ఉంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అశ్విన్, అక్షర్ పటేల్…బంగ్లా బ్యాటర్లను చుట్టేశారు. ఇక, రెండో టెస్ట్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. బ్యాటింగ్ ఎంచుకుంది..
Read Also: Severity of Cold: వణుకుతున్న తెలంగాణ.. పెరిగిన చలి తీవ్రత
Also Read
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
- PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
మొదటి ఇన్నింగ్స్లో 150కే బంగ్లాను కూల్చేశారు. రెండో ఇన్నింగ్స్లో…324 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటారు. ఇదే ఫామ్ను రెండో టెస్టులోనూ కొనసాగిస్తే.. టీమిండియా సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. రోహిత్ శర్మ దూరం కావడంతో.. తొలి టెస్టుకు సారథ్యం వహించిన కేఎల్ రాహుల్.. రెండో టెస్టులోనూ టీమిండియాను నడిపించనున్నాడు. అద్భుత ఆటతీరుతో తొలి టెస్టులో 188 పరుగులతో గెలుపొందిన టీమిండియా.. సిరీస్లో 1-0 ఆధిక్యంతో ఉంది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరుకుంది. ఈ టెస్టులోనూ గెలుపొందితే.. పాయింట్ల పట్టికలోనూ టీమిండియా ఎగబాకనుంది. ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకెళుతూ 120పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే టీమ్ఇండియా 87 పాయింట్లతో రెండులో ఉంది. ఇప్పటి వరకు భారత్ ఏడు విజయాలు, నాలుగు ఓటములు, రెండు డ్రాలు చేసుకుంది. ఇవాళ్టి నుంచి బంగ్లాదేశ్తో మొదలవుతున్న రెండో టెస్టులోనూ గెలిచి డబ్ల్యూటీసీ రేసులో మరింత ముందంజ వేయాలని టీమ్ఇండియా చూస్తున్నది. ఇక, తుది జట్టులో కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుబమ్గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జాదవ్, ఉమేష్ యాదవ్, సిరాజ్కు చోటు దక్కింది.
తాజావార్తలు
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..