MV Ganga Vilas: ప్రపంచంలో అతిపొడవైన రివర్ క్రూయిజ్.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ప్రత్యేకతలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MV Ganga Vilas: ప్రపంచంలోనే అతి పొడవైన నదీ యాత్రను ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి వారణాసి వేదిక కానుంది. ఎంవీ గంగా విలాస్ అనే నౌకను వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గా గుర్తింపు పొందింది. షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర మంత్రులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.
Read Also: Pakistan: భారత ఛానెళ్లను ప్రసారం చేస్తున్న కేబుల్ ఆపరేటర్లపై పాక్ ప్రభుత్వం చర్యలు..
Also Read
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
- Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
- West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
వారణాసి నుంచి బయలుదేరే ఈ నౌక బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘడ్ చేరుకుంటుంది. మొత్తం యాత్రకు 51 రోజలు సమయం పడుతుంది. 3200 కిలోమీటర్లు ప్రయాణించనుంది. వారణాసి మీదుగా పాట్నా, కోల్కతా, బంగ్లాదేశ్, గౌహతి, దిబ్రూగర్ వెంబడి నౌక పూ్రయాణిస్తుంది. మూడు అంతస్తులు ఉండే ఈ నౌక పొడవు 62 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు ఉంటుంది. మొత్తం 27 నదీ వ్యవస్థల గుండా ప్రయాణం సాగనుంది. భారతదేశం, బంగ్లాదేశ్ కళలు, సంస్కృతి, చరిత్రను తెలుసుకునేందుకు విదేశీ పర్యాటకులకు ఈ నదీయాత్ర ఉపయోగపడనుంది. దేశంలో క్రయీజ్ పర్యటకానికి ఇది సహకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
నౌకా ప్రత్యేకతలివే..
ఉత్తర్ ప్రదేశ్ వారణాసి నుంచి బయలుదేరే ఈ ఎంవీ గంగా విలాస్ మొత్తం 3200 కిలోమీటర్లు ప్రయాణించి, బంగ్లాదేశ్ మీదుగా అస్సాం చేరుకుంటుంది. మూడు అంతస్తులు ఉండే ఈ నౌకలో మొత్తం 18 సూట్స్ ఉన్నాయి. తొలి యాత్ర కోసం న్యూజిలాండ్ కు చెందిన 32 మంది యాత్రీకులు నౌక మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ. 25,000. antara luxury river cruises సైట్ ద్వా రా టిక్కె ట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. జిమ్, స్పా వంటి సదుపాయాలతో పాటు అత్యాధునిక సౌకర్యాలు నౌకలో ఉన్నాయి. మొత్తం 27 నదుల ద్వారా ప్రయాణం సాగుతుంది. ప్రపంచ వారసత్వ కట్టడాలు, జాతీయ ఉద్యానవనాలు, నదుల ఒడ్డున ఉండే పట్టణాలు, పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను సందర్శించవచ్చు. సుందర్భన్, బెంగాల్ డెల్టా ప్రాంతాలు, కజిరంగ నేషనల్ పార్క్ వంటి వాటిని సందర్శించే అవకాశం ఉంది. మొదటి రోజు వారణాసిలో గంగా హారతి తర్వాత నౌక బయలుదేరుతుంది. ఎనిమిది రోజుల్లో పాట్నాకు, 20వ రోజు కోల్ కతాకు, 35 రోజు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు, 50వ రోజు అస్సాం దిబ్రూగఢ్ కు చేరుకుంటుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
-
Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
-
Kanchana 4: కాంచన – 4 లో లేడీ సూపర్ స్టార్? లారెన్స్ సినిమాలో ముగ్గురు అందమైన దెయ్యాలు!
-
US-Iran War: “యురేనియం”పై ఇరాన్ బిగ్ గేమ్.. ట్రంప్కు రిక్త హస్తమే..
-
Hyderabd Weather Update : హైదరాబాద్లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!