TS BJP: బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ఢిల్లీలో బీజేపీలో వున్న పరిస్థితులపై హాట్ కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన చేసిన చిట్ చాట్ (వీడియో బయటకు రావడం)తో మాట్లాడిన తీరుపై పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునీల్ భన్సల్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. రెండు రోజుల పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఆయన సమీక్షించనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మారుస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమావేశం నిర్వహిస్తుంది.
8న ఉదయమే వచ్చి గ్రౌండ్ లో ఉండాలని, కేసీఆర్ అంటే మోసం మోడీ గారు మన బాస్ అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. ఇవాళ బీజేపీ సన్నాహక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మోడీ నన్ను శభాష్ అన్నారు.. నన్ను అంటే మిమ్ముల్ని అన్నట్టేనని పార్టీ శ్రేణులకు వెల్లడించారు. వరంగల్ లో మళ్ళీ శభాష్ అనాలని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆయన వ్యాఖ్యానించారు.
కాజీపేట అయోద్యపురం వద్ద రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ కు ఈనెల 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేయనున్నారు. వర్క్ షాప్ శంఖుస్థాపన ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ పరిశీలించారు. అనంతరం హన్మకొండ హరిత కాకతీయలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
కాజీపేట అయోద్యపురం వద్ద రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ కు ఈనెల 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేయనున్నారు. వర్క్ షాప్ శంఖుస్థాపన ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ పరిశీలించారు. దక్షిణమద్య రైల్వే అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో మార్పులు చోటుచేసుకుంటాయా? ఇదే ఇప్పుడు కమలనాథుల్లో హాట్ టాపిక్గా మారింది. సోమవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం ఉన్నందున టీబీజేపీలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే చర్చ మరింత హీటెక్కిపోతోంది
తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను మార్చుతారనే ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. బండి సంజయ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండటం, బీజేపీ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అధ్యక్షుడి మార్పు అంశం తెరపైకి వచ్చింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదని, అలాంటి ఆలోచన…