Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News High Command Is Serious About Raghunandan Comments On Bandisanjay

TS BJP: బండిపై రఘునందన్ వ్యాఖ్యలు.. హైకమాండ్ కు చేరిన ఇష్యూ

Published Date :July 4, 2023 , 11:53 am
By NTV WebDesk
TS BJP: బండిపై రఘునందన్ వ్యాఖ్యలు.. హైకమాండ్ కు చేరిన ఇష్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

TS BJP: బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఢిల్లీలో బీజేపీలో వున్న పరిస్థితులపై హాట్‌ కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన చేసిన చిట్ చాట్ (వీడియో బయటకు రావడం)తో మాట్లాడిన తీరుపై పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన కామెంట్స్ ను ట్రాన్స్లేట్ చేసి పార్టీ హై కమాండ్ కు పంపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఇంఛార్జి తరుణ్ చుగ్ దృష్టికి ఇష్యూ చేరింది. అమిత్ షా, నడ్డాలను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడినా.. చర్యలు ఉండవా అని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. ఇంకా ముంబై లోనే ఉన్న బండి సంజయ్ ఉన్నారని టాక్‌.. దీనిపై హైకమాండ్ తో మాట్లాడేందుకు ఈరోజు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీజేపీలో పరిస్థితులపై హాట్‌ కామెంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందే అనే తరహాలో.. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్.. లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వండి అంటూ స్పష్టం చేశారు. తాను పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా, నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదు? అని ప్రశ్నించారు రఘునందన్‌.. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు.. రెండో సారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే గా గెలుస్తా అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నేను పార్టీలో ఉండాలని అనుకుంటున్నా అని స్పష్టం చేశారు.. 100 కోట్లు ఖర్చుపెట్టినా మునుగోడులో గెలవలేదు.. అదే 100 కోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాణ్ణి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు.. కేసీఆర్‌ను కొట్టె మొగోణ్ణి నేనేనని జనాలు నమ్మారని.. అంతేకాని బీజేపీని చూసి కాదు అంటూ తేల్చేశారు.

నాకంటే ముందు దుబ్బాకలో బీజేపీ పోటీచేస్తే వచ్చింది 3500 ఓట్లు మాత్రమేనని గుర్తుచేశారు రఘునందన్‌.. ఇక, బండి సంజయ్ ది స్వయం కృతాపారాధం అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీచేసిన సంజయ్ కి వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడిది? అని నిలదీశారు.. పార్టీ డబ్బులో నాకు వాటా ఉంది. పేపర్ ప్రకటనలో తరుణ్ చూగ్, సునీల్ బన్సల్ ల బొమ్మలు కాదు రఘునందన్, ఈటల రాజేందర్‌ బొమ్మలుంటే ఓట్లు వేస్తారు. పార్టీ గుర్తు చివరి అంశమే అన్నారు. GHMC ప్లోర్ లీడర్ కావాలని అడిగిఅడిగి దేవర కర్నాకర్ చనిపోయాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి శాసన సభపక్ష నేత లేడనే విషయం జేపీ నడ్డాకు తెలియదన్న ఆయన.. నేను గెలిచినందుకే ఈటల రాజేందర్‌ పార్టీలోకి వచ్చారన్నారు.. బండి సంజయ్ మార్పుపై అడిగితే.. మీడియాలో వస్తున్నవన్నీ నిజాలే అన్నారు రఘునందన్‌.. ఇక, పదేళ్లలో పార్టీకోసం నాకంటే ఎక్కువ ఎవరు కష్టపడలేదని చెప్పుకొచ్చారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు. కాగా, గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు రఘునందన్‌.. ఈ మధ్యే.. ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా హస్తిన వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు.. తాము చెప్పాల్సిందంతా చెప్పామని స్పష్టం చేశారు. మరోవైపు సీయర్ నేతలు సోషల్‌ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు కూడా పార్టీలో హీట్‌ పెంచాయి.. ఈ తరుణంలో బీజేపీ కేంద్ర నాయకత్వం.. తెలంగాణ పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amith Shah
  • bandi sanjay
  • Nadda
  • PM Modi
  • ragunanadan rao

తాజావార్తలు

  • Iran-US War Ending: ట్రంప్ కీలక ప్రకటన.. ‘ఇరాన్‌తో యుద్ధం ముగించే ఆలోచన ఉంది’..

  • Hanumantha Rao Chowdary: టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కన్నుమూత..

  • Trump: రంజాన్ వేళ ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే జూన్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల..

  • Trump-UK: హార్ముజ్‌ కోసం బ్రిటన్ యూటర్న్.. అమెరికాకు గ్రీన్‌సిగ్నల్

ట్రెండింగ్‌

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions