అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు.
రామ మందిర ఘనత భారతీయ జనతా పార్టీదేనని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 'రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రామమందిరం తాళం తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు.
Ram Mandir: అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశంలోని పలువరు ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది. అయితే ఉత్తర్ప్రదేశ్ మీర్జాపూర్లో సాధారణ జీవితం గుడుపుతున్న మహ్మద్ హబీబ్ అనే వ్యక్తికి రామాలయ ఆహ్వానం అందడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. హబీబ్కి రాముడి అక్షింతలు, లేఖ అందాయి. దీంతో అతను భావోద్వేగానికి గురయ్యాడు.
ఇదిలా ఉంటే అయోధ్యలోని రామాలయ మహా సంప్రోక్షణలో పాల్గొనే అతిథులు, భక్తులందరికీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి అందించే ప్రసిద్ధ ప్రసాదమైన 'శ్రీవారి లడ్డూ'ను అందించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష తిరుపతి లడ్డూలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
Dhirendra Shastri: రామాలయ ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో, కేంద్రం చేస్తున్న కార్యక్రమాలపై ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి శుక్రవారం స్పందించారు. ‘‘ఇది అతడి భయాన్ని తెలియజేస్తోందని, మేము మసీదులపై మందిరాలను నిర్మించడం లేదని, దేవాలయాలను పునర్నిర్మించాలని అనుకుంటున్నామని, అతడికి ఈ భయం ఉంటే, ఆ భయంతోనే ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అంటూ ఓవైసీని ఉద్దేశిస్తూ అన్నారు.
Ayodhya Ram temple: అయోధ్యలో భవ్య రామాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22న రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఇదిలా ఉంటే కొంతమంది దుండగులు మాత్రం రామాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై బాంబుదాడులు చేస్తామని బెదిరించారు.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందింది. బుధవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్కు ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్ ఆహ్వాన పత్రిక అందించారు.
QR code scam: రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 22, 2024న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఈ మహత్తర ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు భక్తుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు హడావిడిగా వెళ్లవద్దని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కోరారు.
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రోడ్షో నిర్వహించి పునరాభివృద్ధి చెందిన అయోధ్య రైల్వే స్టేషన్ను ఆవిష్కరించిన అనంతరం కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి ఉత్తరప్రదేశ్ కోసం అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.