Ram Temple Inauguration: రామ మందిరం తాళం తెరిచేందుకు రాజీవ్ గాంధీ ట్రై చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ మందిర ఘనత భారతీయ జనతా పార్టీదేనని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రామమందిరం తాళం తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ బీజేపీ వాళ్ళు అబద్దాలు, తప్పుడు ప్రచారాలు తప్ప మరో పని లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1985లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అయోధ్యలోని అప్పటి బాబ్రీ మసీదు తాళాలను తెరిచిన విషయాన్ని రామలింగారెడ్డి రెడ్డి ప్రస్తావించారు. మేము హిందూ మతాన్ని రాజకీయాలతో తీసుకురామన్నారు. ఈ బీజేపీ వాళ్ళు రాజకీయాలను హిందూ మతంతో పాటు ఆ శ్రీరాముడిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మేము చేయమని మంత్రి రామలింగారెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Yash Birthday: హీరో యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి!
Also Read
- Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
- Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
- PCB: కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్..
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
కాగా, ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం ‘ప్రాణ్ప్రతిష్ఠ’ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని 34,000 ఆలయాలకు సర్క్యులర్ జారీ చేశారు. దీంతో పాటు రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీరథ్ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 మధ్యాహ్నం రామాలయంలోని గర్భగుడిలో రామ్ లాలాను ప్రతిష్టించాలని నిర్ణయించింది. మహా మందిరంలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు.
Read Also: Naa Saami Ranga : దుమ్ము దుకాణం అంటున్న నాగార్జున.. కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్..
ఈ కార్యక్రమానికి నటులు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్ తో పాటు ప్రముఖ దర్శకులు సుభాష్ ఘాయ్, రాజ్కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీతో పాటు రోహిత్ శెట్టి, నిర్మాత మహావీర్ జైన్లకు ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. దీంతో పాటు దక్షిణ భారత సినీ ప్రముఖులు చిరంజీవి, మోహన్లాల్, ధనుష్ లకు కూడా ఆహ్వానం అందింది. ఈ వేడుకకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను కూడా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించింది.
Read Also: ACC Deal: మరో సిమెంట్ కంపెనీని కొనేస్తున్న అదానీ గ్రూప్
అలాగే, అయోధ్యలో రామ్ లల్లా యొక్క ప్రతిష్ఠాపన వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు ప్రధాన వేడుక జనవరి 16 నుంచి ప్రారంభమవుతాయి. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ రామ్ లల్లాకు పట్టాభిషేకం ప్రధాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జనవరి 14 నుంచి జనవరి 22 వరకు అయోధ్యలో అమృత్ మహా ఉత్సవ్ నిర్వహించనున్నారు. 1008 హుండీ మహాయజ్ఞం కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో వేలాది మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లోని రామమందిరం యొక్క మహా సంప్రోక్షణకు చేరుకునే వేలాది మంది భక్తులకు వసతి కల్పించడానికి అయోధ్యలో అనేక వసతులు కల్పించారు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!