Abrar Ahmed: కావ్యా మారన్ టీమ్లోకి ఎంట్రీ.. ట్రోల్స్పై పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ స్పిన్నర్ షాకింగ్ రియాక్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abrar Ahmed: సన్రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై యాజమాన్యం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఎస్ఆర్హెచ్ అభిమానులు సైతం పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. అప్పటి వరకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు ఫేవరెట్గా ఉన్న కావ్యా మారన్ ఒక్కసారిగా విలన్లా మారిపోయింది. ఇక ఈ అంశంపై తాజాగా పాకిస్థాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ స్పందించాడు. మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండగా, అబ్రార్ అహ్మద్ మాత్రం ఈ విమర్శల గురించి ఏమాత్రం ఆందోళన చెందడం లేదని సమాచారం. టెలికాం ఏషియా స్పోర్ట్ (Telecom Asia Sport) నివేదికల ప్రకారం.. అబ్రార్ ఈ విమర్శల పట్ల చాలా ప్రశాంతంగా ఉన్నాడట. వీటిని అస్సలు పట్టించుకోవడం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. “అబ్రార్ తన పనితాను చేసుకుపోతున్నాడు. ఈ వివాదాల వల్ల అస్సలు డిస్ట్రబ్ కావడం లేదు.” అని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై ఇప్పటికే పీసీబీ అధికారులు స్పందించారు. ప్రస్తుతం అబ్రార్ టీ20 ర్యాంకింగ్స్లో టాప్-3 బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. అందుకే విదేశీ లీగ్లలో అతనికి భారీ డిమాండ్ ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) వర్గాలు పేర్కొన్నాయి. ఇది ప్రధానంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB), ఫ్రాంచైజీల మధ్య జరిగిన ఒప్పందం కాబట్టి, తాము దీనిపై అధికారికంగా స్పందించాల్సిన అవసరం లేదని పీసీబీ భావిస్తోందట.
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ అంశంపై తన కాలమ్లో స్పందించిన సునీల్ గవాస్కర్, గత కొన్ని సంవత్సరాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకుంటే ఇటువంటి ప్రతిచర్య సహజమని పేర్కొన్నారు. 2008లో జరిగిన 2008 ముంబై దాడుల తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడనివ్వలేదని గుర్తు చేశారు. అలాగే 2019లో జరిగిన పుల్వామా వంటి ఘటనలు భారతదేశంలో ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేశాయని తెలిపారు. భారత యాజమాన్యంలో ఉన్న జట్టు పాకిస్థాన్ ఆటగాడికి చెల్లించే డబ్బు అక్కడ పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరుతుందని, ఆ నిధులను ఆయుధాల కొనుగోలుకు ఉపయోగించే అవకాశముందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. భారత యజమాని ఒక పాకిస్థాన్ ఆటగాడికి డబ్బు చెల్లిస్తే, అది పరోక్షంగా భారత సైనికులు లేదా పౌరులపై ప్రభావం చూపే వ్యవస్థకు నిధులు సమకూర్చినట్టే అవుతుంది. ఒక టోర్నమెంట్ గెలవడం భారతీయుల ప్రాణాల కంటే ముఖ్యమా?” అని గవాస్కర్ ప్రశ్నించారు.
READ MORE: Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
-
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
-
SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!