Abrar Ahmed: కావ్యా మారన్ టీమ్లోకి ఎంట్రీ.. ట్రోల్స్పై పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ స్పిన్నర్ షాకింగ్ రియాక్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abrar Ahmed: సన్రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై యాజమాన్యం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఎస్ఆర్హెచ్ అభిమానులు సైతం పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. అప్పటి వరకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు ఫేవరెట్గా ఉన్న కావ్యా మారన్ ఒక్కసారిగా విలన్లా మారిపోయింది. ఇక ఈ అంశంపై తాజాగా పాకిస్థాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ స్పందించాడు. మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండగా, అబ్రార్ అహ్మద్ మాత్రం ఈ విమర్శల గురించి ఏమాత్రం ఆందోళన చెందడం లేదని సమాచారం. టెలికాం ఏషియా స్పోర్ట్ (Telecom Asia Sport) నివేదికల ప్రకారం.. అబ్రార్ ఈ విమర్శల పట్ల చాలా ప్రశాంతంగా ఉన్నాడట. వీటిని అస్సలు పట్టించుకోవడం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. “అబ్రార్ తన పనితాను చేసుకుపోతున్నాడు. ఈ వివాదాల వల్ల అస్సలు డిస్ట్రబ్ కావడం లేదు.” అని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై ఇప్పటికే పీసీబీ అధికారులు స్పందించారు. ప్రస్తుతం అబ్రార్ టీ20 ర్యాంకింగ్స్లో టాప్-3 బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. అందుకే విదేశీ లీగ్లలో అతనికి భారీ డిమాండ్ ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) వర్గాలు పేర్కొన్నాయి. ఇది ప్రధానంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB), ఫ్రాంచైజీల మధ్య జరిగిన ఒప్పందం కాబట్టి, తాము దీనిపై అధికారికంగా స్పందించాల్సిన అవసరం లేదని పీసీబీ భావిస్తోందట.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ అంశంపై తన కాలమ్లో స్పందించిన సునీల్ గవాస్కర్, గత కొన్ని సంవత్సరాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకుంటే ఇటువంటి ప్రతిచర్య సహజమని పేర్కొన్నారు. 2008లో జరిగిన 2008 ముంబై దాడుల తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడనివ్వలేదని గుర్తు చేశారు. అలాగే 2019లో జరిగిన పుల్వామా వంటి ఘటనలు భారతదేశంలో ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేశాయని తెలిపారు. భారత యాజమాన్యంలో ఉన్న జట్టు పాకిస్థాన్ ఆటగాడికి చెల్లించే డబ్బు అక్కడ పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరుతుందని, ఆ నిధులను ఆయుధాల కొనుగోలుకు ఉపయోగించే అవకాశముందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. భారత యజమాని ఒక పాకిస్థాన్ ఆటగాడికి డబ్బు చెల్లిస్తే, అది పరోక్షంగా భారత సైనికులు లేదా పౌరులపై ప్రభావం చూపే వ్యవస్థకు నిధులు సమకూర్చినట్టే అవుతుంది. ఒక టోర్నమెంట్ గెలవడం భారతీయుల ప్రాణాల కంటే ముఖ్యమా?” అని గవాస్కర్ ప్రశ్నించారు.
READ MORE: Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!