Dhirendra Shastri: “ఓవైసీలో ఆ భయం ఉండాలి”.. భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhirendra Shastri: రామాలయ ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో, కేంద్రం చేస్తున్న కార్యక్రమాలపై ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి శుక్రవారం స్పందించారు. ‘‘ఇది అతడి భయాన్ని తెలియజేస్తోందని, మేము మసీదులపై మందిరాలను నిర్మించడం లేదని, దేవాలయాలను పునర్నిర్మించాలని అనుకుంటున్నామని, అతడికి ఈ భయం ఉంటే, ఆ భయంతోనే ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అంటూ ఓవైసీని ఉద్దేశిస్తూ అన్నారు.
ఇటీవల బాబ్రీ మసీదు గురించి ప్రస్తావిస్తూ.. గత 500 ఏళ్లుగా పవిత్ర ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదని, యువకులారా మనం, మన మసీదును కోల్పోయాము, మీకు బాధగా లేదా..? అని భవానీ నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓవైసీ వ్యాఖ్యానించారు. మరో మూడు నాలుగు మసీదుల గురించి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ముస్లిం యువకులు అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
Also Read
Read Also: MLA MS Babu: ఎమ్మెల్యే యూటర్న్..! ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైసీపీతోనే..!
ఈ వ్యాఖ్యలపై మాట్లాడిని ధీరేంద్ర శాస్త్రీ.. శ్రీరాముడు రాజకీయ అంశం కాదని, దీన్ని రాజకీయ చేయడం మూర్ఖత్వం అని అన్నారు. రాజకీయాలు మతం ద్వారా నడుస్తాయి, రాజకీయాల ద్వారా మతం నడవదని, దేశ ప్రజలు మేల్కొనే ఉన్నారని, ప్రతీది చూడగలరని, జాతీయ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఓటేయండి, రాముడికి గౌరవం, ఐక్యత, శాంతి అనే సొంత విధానం ఉందని, దీన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామ మందిరాన్ని కులతత్వం కోసం నిర్మించడం లేదని, రామభక్తుల విశ్వాసం కోసం నిర్మిస్తున్నారని అన్నారు. రాముడు అందరికి చెందిన వాడు అని అన్నారు. మరో రెండు మసీదు వివాదాల గురించి స్పందించిన ధీరేంద్ర శాస్త్రీ..జ్ఞానవాపిలో శివుడు, కృష్ణజన్మభూమిలో శ్రీ కృష్ణుడు ఉన్నాడని అన్నారు. ఈ విషయాల్లో ఎవరి అభిప్రాయం అవసరం లేదని, చట్టం, భారత సుప్రీంకోర్టు ఉన్నాయని, అక్బర్, బాబర్ గతంలో మన దేవాలయాలపై దాడి చేశారని అన్నారు. దీపావళి పండగ కంటే ఈ కార్యక్రయం చాలా ప్రత్యేకమైందని అన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!