Dhirendra Shastri: “ఓవైసీలో ఆ భయం ఉండాలి”.. భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhirendra Shastri: రామాలయ ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో, కేంద్రం చేస్తున్న కార్యక్రమాలపై ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి శుక్రవారం స్పందించారు. ‘‘ఇది అతడి భయాన్ని తెలియజేస్తోందని, మేము మసీదులపై మందిరాలను నిర్మించడం లేదని, దేవాలయాలను పునర్నిర్మించాలని అనుకుంటున్నామని, అతడికి ఈ భయం ఉంటే, ఆ భయంతోనే ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అంటూ ఓవైసీని ఉద్దేశిస్తూ అన్నారు.
ఇటీవల బాబ్రీ మసీదు గురించి ప్రస్తావిస్తూ.. గత 500 ఏళ్లుగా పవిత్ర ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదని, యువకులారా మనం, మన మసీదును కోల్పోయాము, మీకు బాధగా లేదా..? అని భవానీ నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓవైసీ వ్యాఖ్యానించారు. మరో మూడు నాలుగు మసీదుల గురించి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ముస్లిం యువకులు అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
Read Also: MLA MS Babu: ఎమ్మెల్యే యూటర్న్..! ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైసీపీతోనే..!
ఈ వ్యాఖ్యలపై మాట్లాడిని ధీరేంద్ర శాస్త్రీ.. శ్రీరాముడు రాజకీయ అంశం కాదని, దీన్ని రాజకీయ చేయడం మూర్ఖత్వం అని అన్నారు. రాజకీయాలు మతం ద్వారా నడుస్తాయి, రాజకీయాల ద్వారా మతం నడవదని, దేశ ప్రజలు మేల్కొనే ఉన్నారని, ప్రతీది చూడగలరని, జాతీయ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఓటేయండి, రాముడికి గౌరవం, ఐక్యత, శాంతి అనే సొంత విధానం ఉందని, దీన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామ మందిరాన్ని కులతత్వం కోసం నిర్మించడం లేదని, రామభక్తుల విశ్వాసం కోసం నిర్మిస్తున్నారని అన్నారు. రాముడు అందరికి చెందిన వాడు అని అన్నారు. మరో రెండు మసీదు వివాదాల గురించి స్పందించిన ధీరేంద్ర శాస్త్రీ..జ్ఞానవాపిలో శివుడు, కృష్ణజన్మభూమిలో శ్రీ కృష్ణుడు ఉన్నాడని అన్నారు. ఈ విషయాల్లో ఎవరి అభిప్రాయం అవసరం లేదని, చట్టం, భారత సుప్రీంకోర్టు ఉన్నాయని, అక్బర్, బాబర్ గతంలో మన దేవాలయాలపై దాడి చేశారని అన్నారు. దీపావళి పండగ కంటే ఈ కార్యక్రయం చాలా ప్రత్యేకమైందని అన్నారు.
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!