Indore: భారీ అగ్ని ప్రమాదం.. బాలికతో పాటు ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి..!
- ఇండోర్ లో భారీ అగ్ని ప్రమాదం..
- ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి
- మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా..
- తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indore: ఇండోర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బృజేశ్వరి అనెక్స్ ప్రాంతంలోని బెంగాలీ స్క్వేర్ సమీపంలో ఉన్న మూడు అంతస్తుల నివాస భవనంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 3 గంటల సమయంలో ఇంటి బయట పార్క్ చేసిన ఎలక్ట్రిక్ వాహనంలో పేలుడు సంభవించడం వల్ల అగ్ని ప్రమాదం ప్రారంభమైనట్లు తెలిపారు. వాహనం చార్జింగ్ పాయింట్ వద్ద జరిగిన పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.
Most Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు.. అగ్రస్థానం ‘కింగ్’దే, టాప్-10లో అందరూ దిగ్గజాలే!
Also Read
- Ram Mohan Naidu: 'పీ4' విధానంలో శ్రీకాకుళం జిల్లాకు 'ఎ' గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఇంట్లో సుమారు 10 ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉండగా, వాటిలో కొన్ని పేలిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. అగ్ని ప్రమాదం సమయంలో వరుసగా రెండు నుంచి మూడు పేలుళ్లు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. భవనంలో మూడు అంతస్తుల్లో ప్రజలు నివసిస్తున్నారు. అయితే, ఎలక్ట్రానిక్ లాకింగ్ వ్యవస్థ కారణంగా బయటకు రావడం కష్టమైనట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తలుపులు తెరుచుకోకపోవడం వల్ల లోపల ఉన్నవారు చిక్కుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఫైర్ సిబ్బంది, అత్యవసర బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. పక్కనే ఉన్న భవనం ద్వారా లోపలికి ప్రవేశించి కొంతమందిని బయటకు తీసుకొచ్చారు. ముగ్గురిని సురక్షితంగా రక్షించినప్పటికీ, ఆరుగురిని అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పొగ పీల్చడం వల్లే ఎక్కువ మంది మృతి చెందినట్లు వెల్లడైంది.
ఈ ప్రమాదంలో మధ్య అంతస్తు పూర్తిగా దెబ్బతినగా, భవనం కొంత భాగం పూర్తిగా దెబ్బ తినింది. ఈ ఇల్లు పాలిమర్ వ్యాపారి మనోజ్ పుగాలియాకు చెందినదిగా గుర్తించారు. ఎల్పీజీతో పాటు ఇతర మండే పదార్థాలు కూడా ఇంట్లో ఉండే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను విజయ్ సేథియా (65), చిన్నూ సేథియా (22), సుమన్ (60), మనోజ్ పుగాలియా (65), సిమ్రన్ (30), రాశి సేథియా (12), టిను (35)గా గుర్తించారు. గాయపడిన సౌరభ్ పుగాలియా (30), ఆశిష్ (30), హర్షిత్ పుగాలియా (25) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
-
Robbery : గచ్చిబౌలిలో బస్సు దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!