Indore: భారీ అగ్ని ప్రమాదం.. బాలికతో పాటు ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి..!
- ఇండోర్ లో భారీ అగ్ని ప్రమాదం..
- ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి
- మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా..
- తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indore: ఇండోర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బృజేశ్వరి అనెక్స్ ప్రాంతంలోని బెంగాలీ స్క్వేర్ సమీపంలో ఉన్న మూడు అంతస్తుల నివాస భవనంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 3 గంటల సమయంలో ఇంటి బయట పార్క్ చేసిన ఎలక్ట్రిక్ వాహనంలో పేలుడు సంభవించడం వల్ల అగ్ని ప్రమాదం ప్రారంభమైనట్లు తెలిపారు. వాహనం చార్జింగ్ పాయింట్ వద్ద జరిగిన పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.
Most Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు.. అగ్రస్థానం ‘కింగ్’దే, టాప్-10లో అందరూ దిగ్గజాలే!
Also Read
ఇంట్లో సుమారు 10 ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉండగా, వాటిలో కొన్ని పేలిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. అగ్ని ప్రమాదం సమయంలో వరుసగా రెండు నుంచి మూడు పేలుళ్లు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. భవనంలో మూడు అంతస్తుల్లో ప్రజలు నివసిస్తున్నారు. అయితే, ఎలక్ట్రానిక్ లాకింగ్ వ్యవస్థ కారణంగా బయటకు రావడం కష్టమైనట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తలుపులు తెరుచుకోకపోవడం వల్ల లోపల ఉన్నవారు చిక్కుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఫైర్ సిబ్బంది, అత్యవసర బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. పక్కనే ఉన్న భవనం ద్వారా లోపలికి ప్రవేశించి కొంతమందిని బయటకు తీసుకొచ్చారు. ముగ్గురిని సురక్షితంగా రక్షించినప్పటికీ, ఆరుగురిని అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పొగ పీల్చడం వల్లే ఎక్కువ మంది మృతి చెందినట్లు వెల్లడైంది.
ఈ ప్రమాదంలో మధ్య అంతస్తు పూర్తిగా దెబ్బతినగా, భవనం కొంత భాగం పూర్తిగా దెబ్బ తినింది. ఈ ఇల్లు పాలిమర్ వ్యాపారి మనోజ్ పుగాలియాకు చెందినదిగా గుర్తించారు. ఎల్పీజీతో పాటు ఇతర మండే పదార్థాలు కూడా ఇంట్లో ఉండే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను విజయ్ సేథియా (65), చిన్నూ సేథియా (22), సుమన్ (60), మనోజ్ పుగాలియా (65), సిమ్రన్ (30), రాశి సేథియా (12), టిను (35)గా గుర్తించారు. గాయపడిన సౌరభ్ పుగాలియా (30), ఆశిష్ (30), హర్షిత్ పుగాలియా (25) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!