Indore: భారీ అగ్ని ప్రమాదం.. బాలికతో పాటు ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి..!
- ఇండోర్ లో భారీ అగ్ని ప్రమాదం..
- ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి
- మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా..
- తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indore: ఇండోర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బృజేశ్వరి అనెక్స్ ప్రాంతంలోని బెంగాలీ స్క్వేర్ సమీపంలో ఉన్న మూడు అంతస్తుల నివాస భవనంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 3 గంటల సమయంలో ఇంటి బయట పార్క్ చేసిన ఎలక్ట్రిక్ వాహనంలో పేలుడు సంభవించడం వల్ల అగ్ని ప్రమాదం ప్రారంభమైనట్లు తెలిపారు. వాహనం చార్జింగ్ పాయింట్ వద్ద జరిగిన పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.
Most Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు.. అగ్రస్థానం ‘కింగ్’దే, టాప్-10లో అందరూ దిగ్గజాలే!
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ఇంట్లో సుమారు 10 ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉండగా, వాటిలో కొన్ని పేలిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. అగ్ని ప్రమాదం సమయంలో వరుసగా రెండు నుంచి మూడు పేలుళ్లు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. భవనంలో మూడు అంతస్తుల్లో ప్రజలు నివసిస్తున్నారు. అయితే, ఎలక్ట్రానిక్ లాకింగ్ వ్యవస్థ కారణంగా బయటకు రావడం కష్టమైనట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తలుపులు తెరుచుకోకపోవడం వల్ల లోపల ఉన్నవారు చిక్కుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఫైర్ సిబ్బంది, అత్యవసర బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. పక్కనే ఉన్న భవనం ద్వారా లోపలికి ప్రవేశించి కొంతమందిని బయటకు తీసుకొచ్చారు. ముగ్గురిని సురక్షితంగా రక్షించినప్పటికీ, ఆరుగురిని అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పొగ పీల్చడం వల్లే ఎక్కువ మంది మృతి చెందినట్లు వెల్లడైంది.
ఈ ప్రమాదంలో మధ్య అంతస్తు పూర్తిగా దెబ్బతినగా, భవనం కొంత భాగం పూర్తిగా దెబ్బ తినింది. ఈ ఇల్లు పాలిమర్ వ్యాపారి మనోజ్ పుగాలియాకు చెందినదిగా గుర్తించారు. ఎల్పీజీతో పాటు ఇతర మండే పదార్థాలు కూడా ఇంట్లో ఉండే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను విజయ్ సేథియా (65), చిన్నూ సేథియా (22), సుమన్ (60), మనోజ్ పుగాలియా (65), సిమ్రన్ (30), రాశి సేథియా (12), టిను (35)గా గుర్తించారు. గాయపడిన సౌరభ్ పుగాలియా (30), ఆశిష్ (30), హర్షిత్ పుగాలియా (25) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!