గత కొన్ని రోజులుగా భారత్లో నిరంతరంగా ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా భారత్లోని మూడు చోట్ల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఇప్పుడు రామాలయం కూడా ఉగ్రవాదుల టార్గెట్గా మారింది.
Raj Thackeray: ప్రధాని నరేంద్రమోడీ లేకుంటే సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా అయోధ్యంలో రామమందిర నిర్మాణం జరగకపోయేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే శనివారం అన్నారు.
Ayodhya Special Train: అయోధ్య బలరాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం ఇవాళ కాజీపేట నుంచి ఆస్తా ప్రత్యేక రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Ram Mandir: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22న అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరై రామ మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాల్లోని ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. లక్షలాది మంది రామాలయ ప్రారంభోత్సవాన్ని చూశారు. ఇదిలా ఉంటే ప్రాణప్రతిష్ట తర్వాత రోజు జనవరి 23 నుంచి సాధారణ భక్తులకు ఆలయ తలుపులు తెరుచుకున్నాయి.
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ కడుపు మండుతోంది. దేశంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, పలువురు ముస్లింలు మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నప్పటికీ.. పాకిస్తాన్ భారత్పై విషప్రచారం చేస్తూనే ఉంది. ఇండియాలో మైనారిటీలో రక్షణ లేదు, ఇండియాలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతోందంటూ అసత్య మాటలు చెబుతోంది. మైనారిటీ హక్కుల్ని హరిస్తూ, ముస్లిం దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇండియాకు సెక్యులరిజంపై నీతులు చెబుతోంది.
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా ఆలయ ట్రస్టు భక్తుల కోసం హారతి, దర్శనానికి వేళల్లో మార్పులు చేసింది. కొత్త సమయాలను పంచుకుంది. రామ మందిరం వద్దనే కాకుండా పక్కనే ఉన్న హనుమాన్ గర్హి ఆలయం వద్ద కూడా భక్తుల సంఖ్య పెరుగుతోంది.
Ram Mandir : మీరు కూడా అయోధ్యను సందర్శించాలనుకుంటున్నరా... అయితే తప్పకుండా ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది.
Ayodhya Ram Temple: దాదాపు 500 ఏళ్ల హిందువుల కల నేటితో తీరింది. అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా దేశంలోని అతిరథులు, లక్షల మంది ప్రజలు హాజరవ్వగా.. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. దాదాపుగా 400 స్తంభాలు, 44 తలుపులతో అయోధ్య రామ మందిరం నిర్మితమైంది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ, స్పోర్స్ట్ సెలబ్రెటీలు, ఇతర రంగాల్లో ప్రముఖులు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.…
రామ భక్తులు ఈ ప్రాణ ప్రతిష్ట దివ్య కార్యక్రమాన్ని పురస్కరించుకుని పవిత్రమైన నీలకంఠ పక్షిని చూసేందుకు వెళ్తున్నారు. ఆగ్రాలో పెద్ద సంఖ్యలో రామ భక్తులు చంబల్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీకి క్యూ కట్టారు.
Ayodhya Ram Temple: దేశవ్యాప్తంగా ప్రస్తుతం రామనామ స్మరణతో నిండిపోయింది. రేపు(జనవరి22)న జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం హిందువులు, రామ భక్తులు ఎదురుచూస్తు్న్నారు. శ్రీ రామ్ లల్లా (బాల రాముడి) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్య ముస్తాబైంది.