Assam: ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఇక జైలే గతి..
- అస్సాంలో హిమంత బిశ్వ శర్మ సంచలన బిల్లు..
- ‘‘బహుభార్యత్వాన్ని’’ నిషేధించే బిల్లుకు ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది. ‘‘బహుభార్యత్వాన్ని’’ నిషేధించే బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం, ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిలు చేసుకునే వ్యక్తులకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఒక వేళ పెళ్లయిన సమాచారాన్ని దాచి పెట్టి మరో వివాహం చేసుకుంటే పదేళ్ల వరకు కఠినమైన శిక్ష విధించబడుతుంది. ఈ బిల్లుపై సీఎం హిమంత మాట్లాడుతూ.. ‘‘ఇది ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ ప్రజలు దీనిని స్వాగతిస్తారు’’ అని అన్నారు.
Read Also: Drishyam 3 Rights: కళ్లు చెదిరే ఆఫర్.. పనోరమా స్టూడియోస్కు ‘దృశ్యం3’ థియేట్రికల్ రైట్స్
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
‘‘ఇస్లాం బహుభార్యత్వాన్ని ప్రోత్సహించదు. ఈ బిల్లు ఆమోదం పొందితే మీరు నిజమైన ముస్లింగా ఉండటానికి అవకాశం లభిస్తుంది. టర్కీ వంటి దేశాలు కూడా బహుభార్యత్వాన్ని నిషేధించాయి. పాకిస్తాన్ లో మధ్యవర్తిత్వ మండలి ఉంది’’ అని హిమంత అన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే యూనిఫాం సివిల్ కోడ్ (UCC)ని ఆమోదిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే, ఈ బిల్లుపై AIUDF పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ను ఉల్లంఘించిందని ఆరోపించారు.
ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకునే వ్యక్తితో పాటు, ఈ వివాహాలను ప్రోత్సహించే వారిని కూడా ఈ బిల్లు శిక్షిస్తుంది. తల్లిదండ్రులు, గ్రామాధికారులు, వివాహానికి హాజరయ్యే వారు, మతపరమైన నిర్వాహకులకు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. దీంతో పాటు దోషులుగా తేలిన వ్యక్తులకు అస్సాం ప్రభుత్వ నిధులు లేదా ప్రభుత్వ ఉపాధి, ప్రభుత్వ పథకాలు, అస్సాంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అనర్హులుగా మారుతారు. బాధిత మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంతం, దిమా హసావో, కర్బి ఆంగ్లాంగ్ మరియు పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు ఈ బిల్లు పరిధిలోకి రారు. ఈ ప్రాంతాలు ఆరవ షెడ్యూల్ కిందకు వస్తాయి.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!