Guwahati: మహిళా ఆఫీసర్ ఇంటిపై దాడి.. భారీగా నోట్ల కట్టలు లభ్యం.. ఉద్యోగంలో చేరి ఎన్ని రోజులైదంటే..!
- అస్సాంలో మహిళా ఆఫీసర్ ఇంటిపై దాడి
- భారీగా నోట్ల కట్టలు.. ఆభరణాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో ఓ మహిళా ఆఫీసర్ కోట్లకు పడగలెత్తింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా అవినీతికి తెరలేపింది. తక్కువ కాలంలోనే కోట్లు వెనకేసుకుంది. అధికారులు జరిపిన సోదాల్లో కోట్లలో నగదు దొరకడంతో సివిల్ సర్వీస్ అధికారి నుపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Puja Khedkar: డ్రైవర్ కిడ్నాప్లో కీలక ట్విస్ట్.. పూజా ఖేద్కర్ ఫ్యామిలీ ఏం చేసిందంటే..!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
నుపుర్ బోరా.. సివిల్ సర్వీస్ అధికారి. గోలాఘాట్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం కమ్రూప్లో సర్కిల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 2019లో అస్సాం సివిల్ సర్వీసులో చేరారు. అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు ఆమె ఇంటిపై నిఘా ఉంచి సోదాలు నిర్వహించారు. దీంతో ఆమె ఇంట్లో రూ.500 నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు రూ.2 కోట్ల నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Delhi BMW crash: బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో కీలక ట్విస్ట్.. నిందితురాలు షాకింగ్ స్టేట్మెంట్
ముఖ్యమంత్రి స్పెషల్ విజిలెన్స్ సెల్ అధికారుల బృందం.. అధికారిణి నుపుర్ బోరా నివాసంపై దాడి చేశారు. రూ.92 లక్షల నగదు, భారీగా ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక బార్పేటలోని అద్దె ఇంట్లో జరిగిన దాడిలో రూ.10 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.2 కోట్ల నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద భూములను మార్పిడి చేస్తున్నట్లుగా ఆరోపణల నేపథ్యంలో గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. అలాగే ఒక హిందూ భూమిని అనుమానాస్పద వ్యక్తులకు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇక నుపుర్ బోరా సహాయకుడు లాట్ మండల్ సూరజిత్ కూడా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. అనేక ఆస్తులను సంపాదించినట్లుగా కనిపెట్టారు. అతడిని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధపడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!