PM Modi: ‘‘అస్సాంను పాక్కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర’’.. మోడీ వ్యాఖ్యలపై హస్తం పార్టీ ఫైర్..
- అస్సాంను పాక్కు అప్పగించే కుట్ర..
- కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రధాని మోడీ..
- మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ..
PM Modi: అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు అస్సాంను పాకిస్తాన్కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని మోడీ ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, ఎదురుదాడి చేసింది. శనివారం గౌహతిలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘అస్సాంను పూర్వపు తూర్పు పాకిస్తాన్లో భాగం చేయడానికి ముస్లిం లీగ్, బ్రిటిష్ వారితో చేతులు కలపడానికి సిద్ధమవడం ద్వారా కాంగ్రెస్ “పాపం” చేసింది’’ అని అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, లోక్సభ ఎంపీ మాణికం ఠాగూర్ స్పందించారు. ఈ ఆరోపణల్ని ఎక్స్ వేదికగా ఖండించారు. అస్సాంను పాకిస్తాన్కు అప్పగించే ప్రతిపాదన లేదని ఆయన అన్నారు. అస్సాం హిందూ మెజారిటీ ప్రావిన్స్ అని, విభజన ప్రణాళికలో పాకిస్తాన్ భాగంగా అస్సాం లేదని, అస్సాంలోని సిల్హెల్ జిల్లా ముస్లిం మెజారిటీ ప్రాతం అని ఆయన అన్నారు. ఇప్పుడు సిల్హెల్ జిల్లా బంగ్లాదేశ్లో భాగంగా ఉంది.
Also Read
- Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!
- PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
Read Also: Railway fare hike: రైలు ప్రయాణికులకు షాక్.. పెరిగిన రైల్వే ఛార్జీలు..
అస్సాం మొదటి సీఎం, కాంగ్రెస్ నేత గోపీనాథ్ బోర్డోలోయ్ పేరు మీద ఉన్న గౌహతి ఎయిర్పోర్ట్లో మోడీ కొత్త టెర్మినల్ ప్రారంభించారు. అస్సాంను రక్షించడానికి బోర్డోలోయ్ కాంగ్రెస్ను ధిక్కరించారని ప్రధాని అననారు. అస్సాం గుర్తింపును నాశనం చేసే చర్యల్ని ఆయన వ్యతిరేకించారని, అస్సాం దేశం నుంచి వేరు కాకుండా కాపాడారని ప్రధాని అన్నారు.
అయితే, మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఠాగూర్ స్పందిస్తూ.. జూలై 1947లో బ్రిటీష్ అధికారంలో ఉన్న సిల్హెట్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని, ఆ తర్వాత అది తూర్పు బెంగాల్లో ఆ తర్వాత తూర్పు పాకిస్తాన్లో భాగమైదని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ నిర్ణయం కాదని గోపీనాథ్ బోర్డోలోయ్ ప్రయత్నాల కారణంగా కరీంగంజ్ సబ్ డిస్ట్రిక్ట్ భారత్లోనే ఉంచబడిందని చెప్పారు. ప్రధానిపై విమర్శలు చేస్తూ.. మోడీ శిక్షణ పొందిన ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని, అబద్ధాలు వ్యాప్తి చేయడం ద్వారా జీవిస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
-
Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
-
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
-
Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి?
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!