నేడు ఏపీ హైకోర్టులో నారా చంద్రబాబు, నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నేడు సీఐడీ విచారణకు రావాలన్న నోటీసులపై తన ఇంటి వద్దే విచారణ చేయాలని మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.…
పొలిటికల్ కరప్షన్ లేని జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని 2024లో తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో వచ్చేది జనసేన- టీడీపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కనుక మేం చర్యలు తీసుకుంటాం.. ప్రతీ సభలో ఈ సమస్యపై మాట్లాడుతాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది.
నేడు తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. నిజామాబాద్లో బీజేపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా నామకరణం చేశారు. 8021 కోట్ల రూపాయల ప్రాజెక్టులను శంకుస్థాపన చేసి వాటిని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలోని NTPCలో 6వేల కోట్ల రూపాయలతో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను తెలంగాణ ప్రజలకు ప్రధాని అంకితం ఇవ్వనున్నారు. ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 85 శాతం (680 మెగావాట్లు) తెలంగాణలోనే వినియోగించేలా నిర్మాణం చేశారు.…
కారల్ మార్క్స్, మహాత్మ గాంధీ సిద్ధాంతాలు చదివి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని నేను అనను అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కానీ వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుని జగన్ వెళుతున్నారు అనేది మాత్రం నేను చెబుతానంటూ సజ్జల అన్నారు.
నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కారించుకుని స్కిల్ స్కామ్ అక్రమ అరెస్టులో న్యాయం కోరుతూ దీక్ష చేయనున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ‘సత్యమేవ జయతే’ పేరుతో నిరహార దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం…
నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహియాత్ర ఆరంభం కానుంది. కృష్ణా జిల్లా నుంచి వారాహియాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డ బహిరంగసభతో పవన్ వారాహియాత్ర ఆరంభం అవుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ కలయికతో వారాహియాత్ర జరగనుంది. నేడు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30కి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రధాని రానున్నారు. మహబూబ్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు చేయనున్నారు. ఆపై మహబూబ్నగర్లో ర్యాలీలో ప్రధాని పాల్గొననున్నారు.…
EX Minister Pomguru Narayana Comments on Chandrababu Naidu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో ఈరోజు కుటుంబ సభ్యులు ములాఖాత్ అయ్యారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ అనంతరం రాజమండ్రి విద్యానగర్లో ఉన్న క్యాంపు ఆఫీసుకు భువనేశ్వరి, బ్రాహ్మణి తిరిగి వెళ్లారు. మరోవైపు మాజీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. జైలులో ఉన్న చంద్రబాబు మనోధైర్యం కోల్పోలేదని తెలిపారు. ‘జైలులో…
Nara Lokesh filed Anticipatory Bail Plea in Two other Cases: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అత్యవసరంగా విచారించాలని ఏపీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ పిటిషన్లు ఏపీ హైకోర్టులో మధ్యాహ్నం విచారణకు రానున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు ఎలైన్మెంట్ కేసులో నారా లోకేశ్…
CM YS Jagan released 5th installment of YSR Vahana Mitra Scheme: ‘వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం’ ఐదో విడత నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. విజయవాడలోని విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం బటన్ నొక్కి వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. 2,75,931 మంది ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున జమ అయ్యాయి. వాహన మిత్రతో ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు లబ్ది పొందారు. లబ్ధిదారుల…