Janasena Cheif: ఏపీలో అధికారంలోకి వచ్చేది జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొలిటికల్ కరప్షన్ లేని జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని 2024లో తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయితీల జోలికి ఎవరూ వెళ్ళరు.. సచివాలయ వ్యవస్ధ తెచ్చి, పంచాయితీల విలువ లేకుండా చేశారు అని పవన్ ఆరోపించారు. ప్రతీ జనసేన సమావేశంలో పంచాయితీ నిధుల దుర్వినియోగంపై మాట్లాడాలి, మేనిఫెస్టోలో పెట్టాలి అని విన్నపం చేశారు. పంచాయితీల్లో దొంగలు పడి 8660 కోట్ల రూపాయలు దోచుకున్నారు.. కాగ్ కూడా సచివాలయాల్లో సర్పంచ్ లకు స్ధానం ఇవ్వకపోవడం చట్ట ఉల్లంఘన అని తెలిపింది.. పంచాయితీలకు వచ్చిన సొమ్ములు 24 గంటల్లో వెళ్ళిపోతున్నాయని ఆయన ఆరోపించారు. ఏపీలో వచ్చేది జనసేన- టీడీపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కనుక మేం చర్యలు తీసుకుంటాం.. ప్రతీ సభలో ఈ సమస్యపై మాట్లాడుతాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Also: MAD Trailer: ఫ్రెండ్స్ మీరు లేకపోతే… నా లైఫ్ ఇంకా మంచిగుండేది… ఈ ట్రైలర్అంతా యూత్ స్టఫ్
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా అద్భుతంగా ఉంటాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. పాలిటిక్స్ అంటే డబ్బు కోసమే అనే పరిస్ధితి వచ్చింది.. పాదయాత్రలో ప్రామిస్ లతో చెప్పలేనన్ని మోసాలు చేసారు.. న్యాయం జరుగనప్పుడు గళం విప్పే హక్కు ఉంది.. 2024లో అలాంటి అవకాశం ఇచ్చే ప్రభుత్వం రానుంది అని ఆయన తెలిపారు. ఇసుకదిబ్బలు ఉండటం దివిసీమ ఉప్పెన సమయంలో ఉపయోగపడింది.. అడ్డగోలుగా ఇసుక డ్రెడ్జింగ్ జరుగకుండా ఒక చట్టం తీసుకురావాలి.. సహజ వనరుల వినియోగంపై భారతీయ శిక్షా స్మృతిలో కఠినమైన చట్టం తేవాలన్నారు. భారతదేశ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ఐఏఎస్ లకు ఉండాలి.. భవిష్యత్తులో అలాంటి చట్టాలు వస్తాయి.. అధికారులు సరిగ్గా స్పందించకపోతే సరైన దిశగా తీసుకెళ్ళేందుకు, తీర ప్రాంతాలు కోతకు గురవకుండా చర్యలు తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: Gas Cylinder: వామ్మో గ్యాస్ సిలిండర్ ధర రూ.3000 లా.. ఎక్కడంటే..?
చేనేత కార్మికుల పరిస్ధితులు చాలా దయనీయంగా ఉన్నాయని జనసేన చీఫ్ పవన్ అన్నారు. చేనేతని బ్రతికించుకోవాలి.. చేనేత ప్రొడక్ట్ లకు నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను.. పచ్చటి పొలాల మధ్యలో ఆకలి చావులుంటాయి అనుకోం.. నెలవారీ పెన్షన్లు కూడా తీసేస్తారేమో అనే భయం ఉండకూడదు.. ఉత్పత్తి కులాలకు ఆకలి చావులు ఉండకూడదు అని ఆయన అన్నారు. చేనేత కార్మికులకు వ్యక్తిగతంగా సహకారం అందించడానికి సిద్ధం అని పవన్ అన్నారు. ఇక, బ్రిటిష్ కాలంలో మన పెద్దలు ఇచ్చిన స్ధలాల్లో ఈ కాలేజీలు పెట్టారు.. ఎయిడెడ్ కళాశాలలు రద్దు చేయడం చాలా దారుణం.. కాలేజీలను చంపేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాలుగా మాత్రమే దానిని చూస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
Read Also: Asha Workers: కరీంనగర్ లో ఉద్రిక్తత.. మంత్రి గంగుల ఇంటి ముందు ఆశా వర్కర్ల ఆందోళన
దాతలు ఇచ్చిన స్ధలాలు ఎండోమెంట్ బోర్డుకు ఎలా మళ్ళించారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అసెంబ్లీకి అయినా వెళ్ళాలి.. మన ప్రభుత్వం వస్తే ఒక పాలసీ తేవాలి అని ఆయన అన్నారు. సమగ్రశిక్షలో కాంట్రాక్టు వృత్తివిద్యా టీచర్ల జీతాలు కూడా ఆగిపోయాయని, ఉద్యోగాలు కూడా పోతాయని ఉద్యమాలు చేయట్లేదని, మద్దతు కావాలని కంప్లైంట్ చేశారు.. అలాగే, ఖబరస్తాన్ లలో ఒక బాడీని పాతిపెడితే మరో బాడీ పాతడానికి స్ధలం లేదు.. జనసేన ప్రభుత్వం రాగానే వారి సమస్యలను పట్టించుకోవాలని ముస్లిం మైనారిటీల కంప్లైంట్ చేశారు అని పవన్ తెలిపారు. పార్ధివ దేహాలు పాతిన చోటే మరలా పాతాల్సిన దుస్థితి విశాఖలో కూడా విన్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. మార్చురీ వ్యాన్ కూడా లేదని వినడం దురదృష్టకరం.. జనసేన ప్రభుత్వం రాగానే వసతులతో కూడిన స్మశానవాటికి అందుబాటులోకి తెస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!