ఆంధ్రప్రదేశ్లోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2023 ఫలితాలను బుధవారం ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం రూ.40వేల కోట్లు అప్పులు చేసిందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. వైఎస్సార్ ప్రభుత్వంలో కూ.315 కోట్లు మాత్రమే అప్పులు చేశామని ఆయన తెలిపారు.
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఓ నయా మోసం వెలుగు చూసింది. మృతి చెందిన తండ్రి బ్రతికే ఉన్నాడని చూపించి.. ఓ వ్యక్తి వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. సుమారు 12 సంవత్సరాల నుంచి రూ.4 లక్షల మేర పెన్షన్ డబ్బులు డ్రా చేశాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, ఈ మోసం వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన పారా కిరీటి 2001లో…
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని చెప్పారు.
సత్యసాయి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ వద్ద.. నాగర్ కోయిల్-ముంబయి రైలు వచ్చే సమయంలో గేట్మెన్ గేటు వేయలేదు. అది గమనించని వాహనాదారులు అలానే రైల్వ్ ట్రాక్ దాటుతున్నారు. ఇంతలోనే ట్రైన్ దగ్గరికొస్తుంది. అది గమనించిన లోకో పైలట్ అప్రమత్తతతో వెంటనే రైలును ఆపేశాడు. దీంతో వాహనాదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గేట్మెన్ నిర్లక్ష్యంపై అటు వాహనాదారులు, స్థానికులు తీవ్రంగా ఫైరవుతున్నారు.