A train accident: ఏపీలో మరో రైలుకు తప్పిన ప్రమాదం.. లోకో పైలట్ అప్రమత్తతో సేఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A train accident: ఒడిశాలో రైలు ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా అందరనీ కలచివేస్తుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 288కి చేరింది. మరో 1000 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇంకొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. రాత్రివేళ ప్రమాదం జరగడంతో.. బోల్తాపడిన బోగీల్లో చాలా మంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై సమీక్ష నిర్వహించిన అధికారులు.. చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: Hero Bike: హీరో బైక్ కి USB ఛార్జింగ్…ట్యూబ్లెస్ టైర్లు.. దీని ధర తెలిస్తే షాకే..!
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
ఒడిషాలోని ఘోర రైలు ప్రమాదం అందరిని కంటతడి పెట్టిస్తోంది. దురదృష్టవశాత్తు జరిగిన ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్ సమీపంలో గోదావరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రమాదం ఏమీ జరగకపోవడంతో అటు రైల్వే అధికారులు, ట్రైన్ లో ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో రైలుకు ప్రమాదం తప్పినట్లైంది.
Read Also: Gudiwada Amarnath: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 170 మంది తెలుగు వారు ఉన్నారు- మంత్రి గుడివాడ అమర్నాథ్
ఎక్కడైనా రైల్వే గేట్ల వద్ద ట్రైన్ వచ్చే సమయంలో ముందుగానే గేట్ వేస్తారు. కానీ సత్యసాయి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ వద్ద.. నాగర్ కోయిల్-ముంబయి రైలు వచ్చే సమయంలో గేట్మెన్ గేటు వేయలేదు. అది గమనించని వాహనాదారులు అలానే రైల్వ్ ట్రాక్ దాటుతున్నారు. ఇంతలోనే ట్రైన్ దగ్గరికొస్తుంది. అది గమనించిన లోకో పైలట్ అప్రమత్తతతో వెంటనే రైలును ఆపేశాడు. దీంతో వాహనాదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గేట్మెన్ నిర్లక్ష్యంపై అటు వాహనాదారులు, స్థానికులు తీవ్రంగా ఫైరవుతున్నారు. ఒకవేళ లోకో పైలట్ ట్రైన్ ఆపకపోతే ఎలాంటి ఘోర ప్రమాదం జరిగిఉండునోనని ఆందోళన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన రైల్వే అధికారులు గేట్మెన్ నిర్లక్ష్యంపై విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?